News January 2, 2025

మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

image

ఉమ్మడి MDK జిల్లాలో న్యూఇయర్ రోజు జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. వివరాలు.. జోగిపేటలో డివైడర్‌ను ఢీకొని మహ్మద్ పాషా(25) మృతి చెందగా, హత్నూరలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న నీరుడి కృష్ణ(27) పై నుంచి లారీ వెళ్లడంతో చనిపోయాడు. కొండపాకలో స్నేహితులను కలిసి వస్తుండగా భాను చందర్(22) సూచిక బోర్డును ఢీకొని మృతిచెందగా, మెదక్‌లో మున్సిపల్ జవాన్ సంజీవ్(41) అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు.

Similar News

News December 23, 2025

మెదక్: ‘ఇందిరమ్మ లబ్ధిదారులకు రూ.6.46 కోట్లు జమ’

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 509 మంది లబ్ధిదారులకు వారం రోజుల్లోనే రూ.6.46 కోట్లు లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లో జమ అయినట్లు హౌసింగ్ పీడీ మాణిక్యం తెలిపారు. 4,529 మంది లబ్ది దారులకు ఇప్పటికే సుమారుగా రూ.90 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. మెదక్ జిల్లా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతిపై హౌసింగ్ పీడీ మాట్లాడారు.

News December 23, 2025

కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో డిఫెన్స్‌లోకి రేవంత్ సర్కార్: హరీశ్ రావు

image

తెలంగాణ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన మాజీ మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో రేవంత్ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిందన్నారు. పేదల సమస్యలు వదిలి షోలు, సమ్మిట్‌లతో కాలం గడుపుతోందని ఆరోపించారు. కో ఆపరేటివ్ ఎన్నికలు తప్పించుకుంటూ భయంతో పాలన సాగుతోందన్నారు.

News December 23, 2025

MDK: నాణ్యమైన దర్యాప్తుతో న్యాయం చేయాలి: ఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పాల్గొన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న గ్రేవ్, నాన్‌గ్రేవ్, మిస్సింగ్, ఎన్‌బీడబ్ల్యూ కేసుల పురోగతిని సమీక్షించారు. ప్రతి కేసును నాణ్యంగా, వేగంగా పూర్తి చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. లాంగ్ పెండింగ్ కేసుల చేధనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.