News January 3, 2025

మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. దుద్యాలలో కంది నూర్పిడి యంత్రంలో పడి మహిళ చనిపోగా.. పాపన్నపేటలో నీట మునిగి రైతు మృతిచెందాడు. సంగారెడ్డిలో చేపల వేటకు వెళ్లిన కార్మికుడు మరణించగా.. సిద్దిపేటలో బైక్ అదుపు తప్పి కూలీ చనిపోయాడు. పరిగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా.. చేగుంటలో మద్యం మత్తులో వ్యక్తి కిందపడి చనిపోయాడు.

Similar News

News January 15, 2025

మెదక్: పోరాట యోధుడి జయంతి నేడు

image

1947లో ఇదే రోజు ప్రశ్నించే ఓ గొంతు జన్మించింది. 1960లో తొలిసారి ఆ కాలాతీత వ్యక్తి HYDలో అడుగుపెట్టారు. ఆయనే విద్యార్థులకు ప్రశ్నించడం నేర్పిన జార్జ్‌రెడ్డి. 25ఏళ్ల వయసులో మార్క్స్, సిగ్మన్‌ఫ్రాయిడ్‌ వంటి ఫిలాసఫర్‌లను చదివేశారు. కేవలం ఉద్యమమే కాదు ఎదుటివారిని ఆలోచింపజేసే వక్త ఆయన. విద్యార్థి ఉద్యమం అంటే జార్జ్‌రెడ్డి గుర్తొచ్చేంతగా ఆయన పోరాటం.. ఓయూ నుంచే ప్రారంభం అవ్వడం హైదరాబాదీలకు గర్వకారణం.

News January 15, 2025

GET READY.. 18న నవోదయ ప్రవేశ పరీక్ష

image

నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు NVS ఈనెల 18న ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని వర్గల్ నవోదయ ప్రిన్సిపల్‌ తెలిపారు. వెబ్‌సైట్‌ www.Navodaya.gov.in నుంచి విద్యార్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. విద్యార్థి పుట్టిన తేదీ లేదా రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు.

News January 15, 2025

మెదక్: చాముండేశ్వరి దేవిని దర్శించుకున్న ఎస్పీ

image

మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ మంజీరా నది తీరాన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం సతీసమేతంగా సందర్శించారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఎస్పీ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరితోపాటు చిలిపిచేడ్ మండల ఎస్ఐ నర్సింలు, సిబ్బంది పాల్గొన్నారు.