News February 19, 2025
మెదక్: వైద్యం చేయించలేక భర్తను చంపేసింది

భర్తను అల్లుడితో కలిసి భార్య హత్య చేసింది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లా పాపన్నపేట మం. బాచారం వాసి ఆశయ్య(45) ఈనెల 15న పొలంలో పనిచేస్తూ పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ఆస్పత్రికి వెళ్తే భారీగా ఖర్చు అవుతుందని భావించిన భార్య శివమ్మ, అల్లుడు రమేశ్ కలిసి ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. సహజమరణంగా నమ్మించే ప్రయత్నంచేయగా మెడపై గాయలు చూసిన మృతుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News November 21, 2025
ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: TTD

AP: శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరులను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు NOV 29న ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు Global Hindu Heritage, savetemples.org సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అవి మోసపూరితంగా విరాళాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 21, 2025
JGTL: ‘కలివి వనం’ దర్శకుడి స్వగ్రామంలో సందడి

నేడు విడుదల కానున్న ‘కలివి వనం’ దర్శకుడు పూసాల రాజ్ నరేంద్ర స్వగ్రామం జగిత్యాల జిల్లాలోని జగ్గాసాగర్. దీంతో ఆ గ్రామంలో ఆనందం నెలకొంది. కాగా, ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి ఆదరణను పొందడంతో గ్రామస్థులు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు మాట్లాడుతూ.. రాజ్ నరేంద్ర గ్రామానికి తెచ్చిన పేరు అభినందనీయం అన్నారు. గ్రామ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న దర్శకుడిని గ్రామస్థులు అభినందించారు.
News November 21, 2025
NRPT: కురుమూర్తి జాతరకు వెళ్తుండగా యాక్సిడెంట్

సీసీకుంట మండలం గూడూరు శివారులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందారు. NRPT జిల్లా ధన్వాడ(M) గోటూరుకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి నందు(23).. స్నేహితుడు, వనపర్తి(D) గట్ల ఖానాపూరం వాసి నితిన్తో కలిసి బైక్పై కురుమూర్తిస్వామి <<18344009>>జాతర<<>>కు వెళ్తున్నారు. ముందున్న ఆటోను తప్పించబోయి ఎదురు వస్తున్న కారును ఢీకొట్టారు. ఈ క్రమంలో ఎగిరి కారు వెనక ఉన్న ట్రాక్టర్ ట్రాలీకి తగలడంతో నందు మృతి చెందాడు.


