News February 19, 2025

మెదక్: వైద్యం చేయించలేక భర్తను చంపేసింది

image

భర్తను అల్లుడితో కలిసి భార్య హత్య చేసింది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లా పాపన్నపేట మం. బాచారం వాసి ఆశయ్య(45) ఈనెల 15న పొలంలో పనిచేస్తూ పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ఆస్పత్రికి వెళ్తే భారీగా ఖర్చు అవుతుందని భావించిన భార్య శివమ్మ, అల్లుడు రమేశ్ కలిసి ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. సహజమరణంగా నమ్మించే ప్రయత్నంచేయగా మెడపై గాయలు చూసిన మృతుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News July 6, 2025

వీణవంక: గిన్నిస్ రికార్డు సాధించిన చిన్నారులకు కేంద్రమంత్రి సన్మానం

image

వీణవంక మండలానికి చెందిన బత్తిని నరేష్ కుమార్తె బత్తిని సహశ్రీ, వేముల సరివిక, కాసర్ల లాస్య గతేడాది హైదరాబాద్‌లో ప్రదర్శించిన కూచిపూడి నృత్యానికి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. వారిని శనివారం కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సత్కరించారు. గిన్నిస్ బుక్ రికార్డు పత్రాన్ని, మెడల్‌ను అందజేశారు. చిన్నారులను ప్రశంసించారు.

News July 6, 2025

పట్టు బిగించిన భారత్.. మరో 7 వికెట్లు తీస్తే..

image

ENGతో రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. 608 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. క్రాలే(0), డకెట్(25), రూట్(6) ఔటయ్యారు. ఆకాశ్‌దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే రేపు ఒక్కరోజే 536 రన్స్ చేయాలి. మరో 7 వికెట్లు తీస్తే టీమ్ ఇండియా గెలుస్తుంది. కాగా రెండో ఇన్నింగ్సులో భారత కెప్టెన్ గిల్ (161) సెంచరీతో మెరిశారు.

News July 6, 2025

ఉమ్మడి ప.గో వ్యాప్తంగా 6, 465 కేసులు రాజీ

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 6, 324 పెండింగ్ కేసులను 141 ప్రీలిటిగేషన్ కేసులను రాజీవ్ చేయడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి తెలిపారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.. మొత్తం 6,465 కేసులను రాజీ జరిగాయన్నారు. మోటార్ వాహన ప్రమాద కేసులు 129, సివిల్ 219, క్రిమినల్ 5,976 అలాగే 141 ప్రీలిటిగేషన్ కేసులను రాజీ చేయడం జరిగిందని స్పష్టం చేశారు.