News February 19, 2025

మెదక్: వైద్యం చేయించలేక భర్తను చంపేసింది

image

భర్తను అల్లుడితో కలిసి భార్య హత్యచేసింది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లా పాపన్నపేట మం. బాచారం వాసి ఆశయ్య(45) ఈనెల 15న పొలంలో పనిచేస్తూ పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ఆస్పత్రికి వెళ్తే భారీగా ఖర్చు అవుతుందని భావించిన భార్య శివమ్మ, అల్లుడు రమేశ్ కలిసి ఆదివారం అర్ధరాత్రి హత్య చేసింది. సహజమరణంగా నమ్మించే ప్రయత్నించగా మెడపై గాయలు చూసిన మృతుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదైంది.

Similar News

News March 24, 2025

ధర్పల్లి: ‘పది’ పరీక్ష రాయాలంటే రూ.5 వేలు ఇవ్వాల్సిందే

image

ధర్పల్లి మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అక్రమాలకు తెరలేపినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. పదో తరగతి పరీక్షల్లో కాపీ చేయాలంటే ఒక్కో విద్యార్థి రూ.5 వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారని, తక్కువ ఇస్తే ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోయారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్లు ఇవ్వాలని పాఠశాల యాజమాన్యం డబ్బులు వసూలు చేస్తోందని ఆరోపించారు.

News March 24, 2025

NRPT: బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు

image

క్రికెట్ బెట్టింగులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. బెట్టింగులతో యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగులపై ఎల్లప్పుడూ నిఘా ఉంచామని అన్నారు.

News March 24, 2025

గుడ్ న్యూస్.. వాటిపై జీఎస్టీ తగ్గింపు?

image

లైఫ్, హెల్త్ పాలసీలపై GST తగ్గింపునకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరిగే సమావేశంలో ఈ పాలసీలపై ట్యాక్స్ తగ్గించేందుకు జీఎస్టీ కౌన్సిల్ అంగీకరించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న 18శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించవచ్చని తెలిపాయి. అయితే పాలసీ మొత్తాన్ని బట్టి ఈ తగ్గింపు వర్తించే అవకాశముంది. ఈ నెలాఖరులో లేదా ఏప్రిల్ తొలివారంలో జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం వెలువడే ఛాన్స్ ఉంది.

error: Content is protected !!