News January 25, 2025
మెదక్: వైద్యా, విద్య ప్రమాణాలు మెరుగుపడాలి: మంత్రి

వైద్యా, విద్య ప్రమాణాలు మెరుగుపడేలా మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు. నూతనంగా నియమితులైన రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2025
శివంపేట: చోరీ కేసులో నలుగురు అరెస్టు

శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల గ్రామ శివారులోని భవ్యస్ ఫార్మసిటికల్ కంపెనీలో ఈనెల 15న జరిగిన చోరీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పరిశ్రమలో అర్ధరాత్రి వేళ ఇనుప సామాగ్రి చోరి చేయగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుమ్మడిదల గ్రామానికి చెందిన వెంకటేష్, ఆంజనేయులు, బ్రహ్మచారి, ధర్మేందర్లను అరెస్ట్ చేసి డిమాండ్కు తరలించారు.
News February 16, 2025
మెదక్: సాంఘిక సంక్షేమ కళాశాలను సందర్శించిన కలెక్టర్

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో మెనూ పగడ్బందీగా అమలు చేయడం హర్షనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ రైల్వే స్టేషన్ సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. వంటకు వినియోగిస్తున్న సరుకులను పరిశీలించారు. ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
News February 16, 2025
హెల్ప్ డెస్క్ ద్వారానే వినతుల స్వీకరణ: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 17 సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి వినతులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనందున కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.