News February 5, 2025

మెదక్‌, సంగారెడ్డి, సిద్దిపేటలో 71,622 మంది ఓటర్లు

image

ఉమ్మడి MDK- KNR-NZB-ADB పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఓటరు జాబితాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 71,622 పట్టభద్రులు, ఉపాధ్యాయు ఓటర్లు ఉండగా 174 పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు ఓటు వేసేందుకు మరో అవకాశం కల్పించగా ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తుది ఓటరు జాబితాను ఈనెల 7న ప్రకటించనున్నారు.

Similar News

News December 23, 2025

హిందూ మహిళలతోనూ అలానే చేయగలరా?: జావేద్ అక్తర్

image

బిహార్ CM నితీశ్ కుమార్ మహిళా డాక్టర్ హిజాబ్ <<18574954>>లాగడం<<>> విమర్శలకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ మండిపడ్డారు. ‘నితీశ్ చేసిన పని అసభ్యకరంగా ఉంది. ఇతరులను అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు. కొన్ని ఏరియాల్లో హిందూ మహిళలు ముఖం కనిపించకుండా ఘూంఘట్ (దుపట్టా, చీరకొంగు) కప్పుకుంటారు. వాటినీ లాగుతారా?’ అని ప్రశ్నించారు.

News December 23, 2025

గూగుల్ టెకీలకు గుడ్‌న్యూస్.. గ్రీన్‌కార్డ్ ప్రాసెస్ మళ్లీ షురూ!

image

H-1B వీసాతో గూగుల్‌లో పనిచేసే వారికి గ్రీన్ కార్డ్ ప్రక్రియను 2026 నుంచి మళ్లీ భారీ స్థాయిలో మొదలుపెట్టాలని కంపెనీ నిర్ణయించింది. ఆఫీసు నుంచి పనిచేస్తూ, మంచి పర్ఫార్మెన్స్ రేటింగ్ ఉన్న సీనియర్లకు ఇందులో ప్రాధాన్యం ఉంటుంది. ఈ అవకాశం కోసం రిమోట్ వర్కర్లు ఆఫీసు లొకేషన్‌కు మారాలి. లేఆఫ్స్ వల్ల రెండేళ్లుగా ఆగిన ఈ ప్రాసెస్ మళ్లీ స్టార్ట్ కానుండటంతో వేలాదిమంది ఉద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

News December 23, 2025

రైతన్నకు మంచిరోజులు వచ్చేది ఎప్పుడో!

image

ధనిక, పేద తేడా లేకుండా అందరి ఆకలి తీర్చేది రైతు పండించే మెతుకులే. దాని కోసం రైతు పడే కష్టం, మట్టితో చేసే యుద్ధం వెలకట్టలేనిది. తెల్లవారుజామునే నాగలి పట్టి పొలానికి వెళ్లే అన్నదాతే అసలైన హీరో. తన రక్తాన్ని చెమటగా మార్చి పంటకు ప్రాణం పోసే రైతు అప్పుల్లో ఉంటే అది దేశానికే తీరని లోటు. రైతు ఆనందంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. మరి రైతు రాజయ్యేదెప్పుడో! *ఇవాళ జాతీయ <<18647657>>రైతు<<>> దినోత్సవం