News February 5, 2025
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలో 71,622 మంది ఓటర్లు

ఉమ్మడి MDK- KNR-NZB-ADB పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఓటరు జాబితాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 71,622 పట్టభద్రులు, ఉపాధ్యాయు ఓటర్లు ఉండగా 174 పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు ఓటు వేసేందుకు మరో అవకాశం కల్పించగా ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తుది ఓటరు జాబితాను ఈనెల 7న ప్రకటించనున్నారు.
Similar News
News January 18, 2026
మీకోసం కాల్ సేవలను ఉపయోగించుకోండి: కలెక్టర్

నరసరావుపేట కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్కు రావడంతో పాటు, ఇంటి నుంచే ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. 1100 నంబర్కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
News January 18, 2026
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో జిల్లాకు మూడు పతకాలు

ఆదిలాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-12 బాలుర 400 మీటర్ల పరుగులో పి. గోవింద్ వెండి పతకం సాధించగా, అండర్-10 విభాగంలో జి. జితేష్ (60 మీటర్లు), అండర్-8 విభాగంలో మరో క్రీడాకారుడు కాంస్య పతకాలు గెలుచుకున్నారు. జిల్లాకు మూడు పతకాలు రావడంపై అథ్లెటిక్స్ సంఘం ప్రతినిధులు పరమేశ్వర్, వెంకటస్వామి హర్షం వ్యక్తం చేశారు.
News January 18, 2026
వెల్లుల్లితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా!

* BP, డయాబెటిస్ను కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
* వీటిలోని అల్లిసిన్, అజోయిన్ రక్తం గడ్డకట్టకుండా చేసి రక్తప్రసరణ సజావుగా జరిగేందుకు సహాయపడతాయి.
* కీళ్లనొప్పులు, దీర్ఘకాలంగా ఉన్న వాపులను తగ్గిస్తుంది.
* పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి ప్రీ బయోటిక్గా పనిచేస్తుంది.
* పడుకునే ముందు తింటే మెరుగైన నిద్ర సొంతమవుతుంది.
* గొంతు, ఊపిరితిత్తుల సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.


