News June 29, 2024

మెదక్ సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జి తనిఖీ

image

సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్. జితేందర్ మెదక్ సబ్ జైలునుతనిఖీ చేశారు. జైలులో ఉన్న ఖైదీల ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. వంటశాల తనిఖీ చేసి ఆహార నాణ్యతపై జైలు పర్యవేక్షణ అధికారితో చర్చించారు. న్యాయ విజ్ఞాన సదస్సులో ముద్దాయిలకు వివిధ అంశాలపై లీగల్ ఏయిడ్ అపాయింట్మెంట్, జైల్ అదాలత్, ప్లీ బార్గెయినింగ్ చట్టాలపై అవగాహన కల్పించారు. జైల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జైలు సిబ్బంది ఉన్నారు.

Similar News

News September 21, 2024

నర్సాపూర్: ‘జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి’

image

జాతీయ లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులు రాజీ చేయదగ్గ కేసులను రాజీ కుదురు కుదుర్చుకోవచ్చని నర్సాపూర్ న్యాయమూర్తి కే అనిత సూచించారు. నర్సాపూర్ కోర్టు ఆవరణలో శుక్రవారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశానికి పోలీస్ అధికారులు హాజరయ్యారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో కక్షిదారీలు రాజి కుదుర్చుకునేలా అవగాహన కల్పించాలన్నారు.

News September 20, 2024

విశ్రాంత అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వేణుగోపాలస్వామి

image

విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా టి వేణుగోపాలస్వామి నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రూపేష్ వేణుగోపాలస్వామిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు విశ్రాంత ఉద్యోగులు పోలీసు సంఘం అధ్యక్షులు ఎల్లయ్య, వైస్ ప్రెసిడెంట్ అఫ్జల్, జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్ రావ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ప్రభాకర్ రెడ్డి, జీవన్, జహింగీర్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.

News September 20, 2024

MDK: నోటి మాట.. ఆ గ్రామం ఆదర్శం..!

image

నోటి మాటతో కట్టుబడి ఆ గ్రామస్థులందరూ కలిసి మద్యపానాన్ని నిషేధించి నేటికి 10 ఏళ్ల పైనే అవుతోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని గూడెంగడ్డలో గ్రామస్థులు గ్రామంలో బెల్టు షాపుల ద్వారా మద్యపానం విక్రయించడం నేరంగా భావించి నాటి నుంచి నేటి వరకు ఎలాంటి విక్రయాలు జరుపకూడదనే నిబంధనను మౌఖికంగానే విధించుకున్నారు. దీంతో మద్యపానం విక్రయించకుండా గూడెంగడ్డ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది.