News April 17, 2024
మెదక్: సివిల్ సర్వీస్ ఫలితాల్లో నర్సంపల్లి వాసి

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన కె. అర్పిత నిన్న విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 639 ర్యాంకు సాధించారు. తండ్రి అమర్ సింగ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో సీనియర్ మేనేజర్ గా పని చేస్తుండగా.. తల్లి రేణుక సదాశివపేట రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ర్యాంకు సాధించడం పట్ల నర్సంపల్లి వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 11, 2025
గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్: BRS

మార్చి 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉండనుంది. కాగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరై గవర్నర్ ప్రసంగం వింటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరై మాట్లాడింది లేదు. మరి ఇప్పుడైనా వస్తారో లేదో అంటే వేచి చూడాల్సిందే !
News March 11, 2025
ఎమ్మెల్సీ అభ్యర్థులను చూసి షాకయ్యా: జగ్గారెడ్డి

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మైండ్ బ్లాంక్ అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఏం మాట్లాడాలో తెలియని షాక్ లో ఉన్నానాని, తానెందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుందని, సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగాను, నేను ఢిల్లీ వెళ్లే సమయానికి రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేరని పేర్కొన్నారు.
News March 11, 2025
మెదక్: ‘నిరుద్యోగ యువతి, యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ’

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ వారిచే ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతీ, యువకులు వివిధ స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇవ్వడానికి 12వ బ్యాచ్ ప్రారంభమవుతున్నట్లు మెదక్ జిల్లా యువజన క్రీడాధికారి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15 లోపు మెదక్లోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.