News May 22, 2024
మెదక్: సైలెంట్ మోడ్లో నాయకులు..!

పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన నాయకులు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఈసారి ఓటరు నాడి తెలియకపోవడంతో మెదక్ ఎంపీగా ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. ఎవరికి వారుగా గెలుపు పై ధీమాతో ఉన్నప్పటికీ లోలోపల రిజల్ట్పై ఆందోళనలో ఉన్నారు. పోటాపోటీగా ప్రచారం చేసినా గెలుపుపై అభ్యర్థులు, నాయకులతోపాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే తుది ఫలితాల కోసం జూన్ 4వ వరకు వేచి చూడాల్సిందే.
Similar News
News December 4, 2025
మెదక్: 2వ విడత బరిలో 670 మంది అభ్యర్థులు

మెదక్ జిల్లాలో రెండవ విడతలో జరగనున్న 8 మండలాల్లోని 149 గ్రామపంచాయతీ ఎన్నికల్లో మొత్తం 670 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చేగుంట (134), చిన్న శంకరంపేట్ (113), రామాయంపేట (87) మండలాల్లో అత్యధిక అభ్యర్థులున్నారు. శనివారం నాటి ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది.
News December 4, 2025
MDK: స్థానిక ఎన్నికలపై దృష్టి సారించిన మాజీ ఎమ్మెల్యే

రామాయంపేట మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలను పూర్తిగా కైవసం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మండలంపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని గ్రామాలలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునే విధంగా పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే గెలుపొందే అభ్యర్థులను మద్దతు తెలుపుతూ ఇతరులు వైదొలగే విధంగా బుజ్జగిస్తున్నారు.
News December 4, 2025
వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.


