News January 28, 2025

మెదక్: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు మారనున్నాయా..?

image

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణన సర్వే ద్వారా మెదక్ జిల్లాలోని 21 మండలాలు, వివిధ గ్రామాలలో గత ప్రభుత్వంలో ఉన్న రిజర్వేషన్లకు ఇప్పుడు రాబోవు స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లు మారన్నట్లు సమాచారం. ఒకవేళ రిజర్వేషన్లు మారితే ఎవరికీ ప్లస్ పాంట్ అవుతుందో, ఎవరికి మైనస్ పాయింట్ అవుతుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ ఉండబోతుందని సమాచారం.

Similar News

News December 17, 2025

మెదక్: ఈనెల 21న జాతీయ లోక్‌ అదాలత్‌

image

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. నీలిమ పిలుపునిచ్చారు. న్యాయమూర్తులతో కలిసి ఆమె మాట్లాడారు. ఎక్కువ సంఖ్యలో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించేలా చొరవ చూపాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్ ద్వారా గరిష్ఠ స్థాయిలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

News December 17, 2025

నర్సాపూర్ ఎమ్మెల్యే స్వగ్రామంలో కాంగ్రెస్ విజయం

image

శివంపేట మండలంలో గోమారం సర్పంచిగా కుమ్మరి హిమవతి ఆంజనేయులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి హిమవతి సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, గోమారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వగ్రామం.

News December 17, 2025

మెదక్: మండలాల వారీగా పోలింగ్ శాతం

image

మెదక్ జిల్లాలో మూడో విడత 7 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా 90.68 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. ఒంటిగంట తర్వాత నమోదైన ఓటింగ్ శాతం.. చిలపిచెడు మండలంలో 90.02, కౌడిపల్లి 90.80, కుల్చారం 89.20, మాసాయిపేట 88.90, నర్సాపూర్ 93.38, శివంపేట 92.57, వెల్దుర్తి 87.62 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.