News June 7, 2024

మెదక్: 6 ఏళ్లలో 498 మంది మృతి

image

జిల్లా వ్యాప్తంగా 2019-24 ఏప్రిల్‌ వరకు 877 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 498 మంది మరణించారు. 828 మంది గాయపడ్డారు. ఇటీవల మక్తల్‌ శివారులో కర్ణాటక బస్సు, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఏటా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు జాగ్రత్తలపై ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

Similar News

News January 3, 2026

నర్సాపూర్‌లో టెట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

నర్సాపూర్ బీవీఆర్‌ఐటీ కళాశాలలోని టెట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సందర్శించారు. జిల్లాలో 200 మంది అభ్యర్థులకు గాను 95 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. మొదటి పేపర్‌కు 65 మంది, రెండో పేపర్‌కు 40 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News January 3, 2026

మనోహరాబాద్: ‘Way2News’ ఎఫెక్ట్.. గేట్ తొలగింపు

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారు పల్లె చెరువు బఫర్ జోన్ స్థలానికి ప్రైవేట్ సీడ్ కంపెనీ ఏర్పాటు చేసిన గేటు తొలగించారు. గత నెల 31న ‘<<18725684>>Way2News<<>>’లో పల్లె చెరువు బఫర్ జోన్‌కు గేటు, ఆందోళన అంటూ కథనం ప్రచురితమైంది. 2న అధికారులు సందర్శించి గేటు తొలగించాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ డీఈ శ్రీకాంత్ ఆదేశాల మేరకు కంపెనీ యాజమాన్యం ఈరోజు బఫర్ జోన్ స్థలానికి ఏర్పాటుచేసిన గేటు తొలగించింది.

News January 3, 2026

మెదక్: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరగాలి: ఎస్పీ

image

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పిల్లలను రక్షించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12 పోస్టర్లను ఎస్పీ డీవీ శ్రీనివాస రావు ఆవిష్కరించారు. ఈ విషయంలో అవగాహన ముఖ్యమన్నారు. బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు ఎస్పీ మహేందర్, ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్ ఉన్నారు.