News February 2, 2025
మెదక్: BRS శ్రేణుల్లో పుల్ జోష్.. నింపిన KCR ప్రసంగం

జహీరాబాద్ నియోజక వర్గం నుంచి రైతులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్కు చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాటలు కార్యకర్తలలో జోష్ను నింపాయి. కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయా ప్రాజెక్టులను మరుగున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అవసరమైతే ఉద్యమించి పోరాటం చేస్తానని తెలిపారు. ఉద్యమంలో తాను ముందుండి నడిపిస్తానన్నారు.
Similar News
News September 18, 2025
న్యాయ సేవలపై పోటీలు: రత్న ప్రసాద్

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో న్యాయం సహాయం ద్వారా అందరికీ న్యాయం అనే పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ బుధవారం తెలిపారు. పౌరుల నుంచి విద్యార్థుల వరకు ఈ అంశంపై ఫోటోగ్రఫీ, పెయింటింగ్, స్కెచ్, వీడియోలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 3వ తేదీలోగా జిల్లా న్యాయ సేవ అధికార కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.
News September 18, 2025
ద్వారకాతిరుమల: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

ద్వారకాతిరుమల(M) ద్వారకానగర్కు చెందిన పఠాన్ రహీం ఖాన్(35) బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన మా అమ్మ గుర్తొస్తోంది.. ఆమె దగ్గరికి వెళ్లి పోతున్నాను.. నువ్వు జాగ్రత్త.. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో.. మళ్లీ పెళ్లి చేసుకో అంటూ సెల్ఫీ వీడియో తీసుకుని, ఆత్మహత్య చేసుకున్నాడు. అతని భార్య షేక్ జెరీనా పి.కన్నాపురం హైస్కూల్లో టీచర్గా పని చేస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 18, 2025
చేబ్రోలులో ఈనెల 19న జాబ్ మేళా: జితేంద్ర

ఉంగుటూరు మండలం చేబ్రోలు గీతాంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈనెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి జితేంద్ర తెలిపారు. ఈ జాబ్ మేళాలో 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, ఫార్మసీ, పీజీ ఉత్తీర్ణత,18-35 వయస్సు ఉన్నవారు అర్హులన్నారు. వివరాలకు 8184887146 నంబర్ను సంప్రదించాలన్నారు. 960 ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు.