News January 17, 2025

మెదక్: DSC-2008 అభ్యర్థుల కల సాకారమయ్యేనా..?

image

16 ఏళ్లుగా ఎదురుచూస్తున్న డీఎస్సీ- 2008 అభ్యర్థుల కల సాకారం అవుతుందా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. DSC-2008 అభ్యర్థుల పోస్టింగులకు సంబంధించిన దస్త్రాలపై సీఎం రేవంత్ రెడ్డి గురువారం సంతకం పెట్టి ఆమోదం తెలపడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. కాగా, 2024 సెప్టెంబర్ 25, 26 తేదీల్లో సంగారెడ్డిలో ఉమ్మడి జిల్లా అభ్యర్థులు 280 మంది వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొన్నారు.

Similar News

News December 19, 2025

MDK: సతులు సర్పంచ్‌లు.. పతులు వార్డ్ మెంబర్‌లు

image

నర్సాపూర్ మం. ఆవంచ, కాగజ్ మద్దూర్‌లో సర్పంచులుగా సతీమణులను గెలిపించుకొని, భర్తలు వార్డు సభ్యులుగా గెలుపొందారు. ఆవంచలో స్రవంతి సర్పంచ్‌గా గెలుపొంది, భర్త కర్ణాకర్ (Ex.సర్పంచ్) వార్డ్ సభ్యుడిగా గెలుపొందారు. కాగజ్ మద్దూర్లో విజయ సర్పంచ్‌గా గెలుపొంది, భర్త శివకుమార్ (Ex.సర్పంచ్) వార్డు సభ్యుడిగా గెలుపొందారు. వారు మాజీ సర్పంచ్‌లుగా కొనసాగి గ్రామానికి సేవలు అందించిన మళ్లీ గ్రామస్థులు పట్టం కట్టారు.

News December 18, 2025

మెదక్ జిల్లాలో మొత్తం పోలింగ్ 89.30 %

image

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.30 % పోలింగ్ నమోదైంది. 21 మండలాలు, 492 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 4,98,152 మంది ఓటర్లకు 4,44,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,39,339లో 2,15,602 మంది, మహిళలు 2,58,806లో 2,29,235 మంది, ఇతరులు ఏడుగురిలో 5 మంది ఓటు వేశారు.

News December 18, 2025

చేగుంట: ట్రాక్టర్ కిందపడి యువకుడి మృతి

image

పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేగుంట మండలం కరీంనగర్ గ్రామానికి చెందిన మహమ్మద్ అక్బర్ గత నెల 29న ఈ ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గురువారం మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.