News July 8, 2024
మెదక్: TECOA రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్ కుమార్ ఏకగ్రీవం

తెలంగాణ కంప్యూటర్ ఆపరేటర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నర్సాపూర్కు చెందిన మోరే రాజ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం హైదరాబాద్ చిక్కడపల్లిలో నిర్వహించిన ఎలక్షన్ కంప్యూటర్ ఆపరేటర్ల సమావేశం నిర్వహించారు. అసోసియేషన్గా ఏర్పడిన నాయకులు నేడు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాణిక్య ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా జ్యోతి, కొండల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Similar News
News February 23, 2026
ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి : కలెక్టర్

ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా 28 కేంద్రాల్లో 12,334 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రశ్నాపత్రాల లీకేజీకి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాల స్పష్టం చేశారు.
News February 22, 2026
MRO, RDO కార్యాలయాల్లో రేపు ప్రజావాణి: మెదక్ కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని MRO, RDO కార్యాలయాల్లో యథావిధిగా అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అయితే, కలెక్టరేట్లో మాత్రం ప్రస్తుతానికి హెల్ప్ డెస్క్ ద్వారానే దరఖాస్తులు తీసుకుంటామని, మార్చి 2 నుంచి అక్కడ పూర్తిస్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
News February 22, 2026
MRO, RDO కార్యాలయాల్లో రేపు ప్రజావాణి: మెదక్ కలెక్టర్

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా పడిన ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి పునఃప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని MRO, RDO కార్యాలయాల్లో యథావిధిగా అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. అయితే, కలెక్టరేట్లో మాత్రం ప్రస్తుతానికి హెల్ప్ డెస్క్ ద్వారానే దరఖాస్తులు తీసుకుంటామని, మార్చి 2 నుంచి అక్కడ పూర్తిస్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తామని స్పష్టం చేశారు.


