News February 27, 2025

మెరకముడదాంలో వందశాతం పోలింగ్

image

మెరకముడిదాం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. ఈ ఎన్నికలలో 100% పోలింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. మెరకముడిదం మండలంలో మొత్తం 55 ఓట్లు ఉండగా మెుత్తం 55 ఓట్లు నమోదైయాయి. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగలేదని ఓటింగ్ ప్రశాంతంగా అయిందని అధికారులు తెలిపారు.

Similar News

News March 23, 2025

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పునరుద్ధరణ

image

రుషికొండ బీచ్ తన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను తిరిగి పొందింది. రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్‌పై విధించిన తాత్కాలిక సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఆ సంస్థ అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా బ్లూ ఫ్లాగ్ ఇండియా జాతీయ ఆపరేటర్ డాక్టర్ శ్రీజిత్ కురూప్, బ్లూ ఫ్లాగ్ ఇండియా జ్యూరీ సభ్యుడు అజయ్ సక్సేనా విశాఖ కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌కుఇందుకు సంబంధించిన గుర్తింపు పత్రాన్ని శనివారం అందజేశారు.

News March 23, 2025

టీబీ రహిత సమాజానికి కృషి చేద్దాం: VZM కలెక్టర్

image

టీబీ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ పిలుపునిచ్చారు. ఈనెల 24న ప్రపంచ క్షయ దినోత్సవం సందర్భంగా శనివారం తమ చాంబర్‌లో క్షయ వ్యాధి అవగాహనకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎస్.జీవన రాణి పాల్గొన్నారు.

News March 22, 2025

VZM: జిల్లాలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తి

image

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవి శనివారం జిల్లా పర్యటనకు నగరానికి చేరుకున్నారు. జిల్లా కోర్టులో జరిగిన న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా SP వకుల్ జిందాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికల్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.

error: Content is protected !!