News March 19, 2025

మెరుగైన విద్యుత్ అందించాలి: ఎన్పీడీసీఎల్ సీఎండీ

image

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సూచించారు. హనుమకొండలోని నక్కలగుట్ట విద్యుత్ భవన్ పరిధిలోని 16 సర్కిళ్ల ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోడ్ పెరిగే ఛాన్స్ ఉన్న సర్కిల్లో పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

Similar News

News October 21, 2025

జాతీయ రహదారి భూసేకరణ నవంబర్‌లోపు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జాతీయ రహదారి 163జీ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ సమస్యలను నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేసి, ఎన్‌హెచ్‌ఏఐకి భూ బదలాయింపు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఆర్బిట్రేషన్ ద్వారా రైతులకు మెరుగైన పరిహారం అందుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూములకు పరిహారం చెల్లింపులు, రీ-సర్వే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ముగించాలని ఆయన ఆదేశించారు.

News October 21, 2025

మానకొండూరు: ఎస్సై సంజీవ్‌ త్యాగం స్ఫూర్తిదాయకం..!

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం మానకొండూరులోని ఎస్సై సంజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుపాకులగూడెంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సంజీవ్ నక్సల్‌తో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారని సీపీ గుర్తుచేశారు. పోలీస్ అమరుల త్యాగాలను స్మరించుకోవాలని, వారి నిబద్ధతను, ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సీపీ ఈ సందర్భంగా సూచించారు.

News October 21, 2025

NLG: కరాటే శిక్షకుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

నల్గొండ జిల్లాలోని PMSHRI పథకం కింద (36 ) ప్రభుత్వ స్కూల్స్ నందు బాలికలకు స్వీయ రక్షణకు సంబందించి 3 నెలల శిక్షణ ఇచ్చేందుకు కరాటే శిక్షకులు కావాలని జిల్లా యువజన, క్రీడల అధికారి మహ్మద్ అక్బర్ అలీ తెలిపారు. ఇందుకు గాను బ్లాక్ బెల్ట్ కలిగిన వారు అర్హులు వారికి నెలకు రూ. 10 వేలు చొప్పున పారితోషకం ఇస్తామన్నారు. మొదటిగా మహిళా అభ్యర్ధులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు.