News February 14, 2025
మెరుగైన వైద్య సేవలు అందించాలి: DMHO

మేడారం జాతరకు వస్తున్న భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని DMHO గోపాలరావు అన్నారు. మేడారంలోని ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్య శిబిరానికి వస్తున్న రోగుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం మొత్తం 110 మందికి వైద్యం అందించామని సిబ్బంది తెలిపారు. రోగులకు ఇబ్బంది లేకుండా అత్యవసర మందులను నిల్వ చేసుకోవాలని డీఎంహెచ్వో సూచించారు.
Similar News
News December 18, 2025
గురువారం రోజు చేయకూడని పనులివే..

గురువారం బృహస్పతి గ్రహంతో అనుసంధానమై ఉంటుంది. వాస్తు ప్రకారం ఈ రోజున కొన్ని వస్తువులు కొనడం మంచిది కాదని నమ్ముతారు. నలుపు రంగు వస్తువులు, బూట్లు, నూనె, ఇనుము/స్టీల్ వస్తువులు కొనడం అశుభమని పండితులు చెబుతున్నారు. అలాగే ఆస్తి లావాదేవీలు చేపడితే ప్రతికూల ప్రభావాలు కలగొచ్చంటున్నారు. నేడు జుట్టు, గోళ్లను కత్తిరించకూడదట. అయితే శత్రువుల బెడద తగ్గడానికి మట్టి కుండ కొనాలని సూచిస్తున్నారు.
News December 18, 2025
పీఏ పల్లి: మానవత్వం చాటుకున్న ఎస్సై విజయ బాయి

మూడో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా పీఏ పల్లి మండలం అంకంపేట, అంగడిపేటలో విధులు నిర్వహించిన మహిళా ఎస్సై విజయబాయి మానవత్వం చాటుకున్నారు. ఓటు వేయడానికి వచ్చిన వికలాంగులు, వయోవృద్ధులను వీల్ చైర్లో కూర్చోబెట్టి స్వయంగా పోలింగ్ రూమ్ వద్దకు తీసుకెళ్లింది. నిధి నిర్వహణలో ఉండి కూడా వృద్ధులు, వికలాంగులకు చేయూతనివ్వడం పట్ల పలువురు ఎస్సై విజయ బాయిని అభినందించారు.
News December 18, 2025
HYD: ‘హద్దు’లు దాటిన ‘విలీనం’

విస్తరణలో భాగంగా GHMC 300 డివిజన్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనిపై అభ్యర్థనలను నిన్నటి వరకు స్వీకరించింది. అయితే విభజించిన వార్డుల్లో తక్కువ, ఎక్కువ ఓటర్లు ఉన్నారంటూ, అసలు దేని ఆధారంగా ఈ ప్రక్రియ చేశారంటూ భగ్గుమన్నారు. స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. 3 వేలకుపైగా అభ్యర్థనలు వచ్చాయని అధికారులు తెలిపారు. డివిజన్లలో హద్దుల మార్పు ఏమైనా జరుగుతుందా, యథావిధిగా ఉంటుందా వేచి చూడాలి.


