News December 4, 2024
మెలియాపుట్టి: ఆవులపై పెద్దపులి దాడి.. రెండు మృతి

పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం గొప్పిలి గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో పెద్దపులి దాడులు చేసిందని పాతపట్నం అటవీశాఖ సెక్షన్ రేంజర్ పట్ట అమ్మి నాయుడు తెలిపారు. బుధవారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. పెద్దపులి ప్రస్తుతం ఒడిశా ప్రాంతానికి తరలి వెళుతున్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో గొప్పిలి వద్ద రెండు ఆవులపై దాడి చేయడంతో మృతి చెందాయని ఆయన స్పష్టం చేశారు.
Similar News
News March 5, 2026
శ్రీకాకుళం: ఇంటర్ అర్హతతో ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో సిక్కోలు యువత అధికంగా విధులు నిర్వహిస్తుంటారు. ఎప్పటికప్పుడు జరిగిన త్రివిధ దళాల ర్యాలీల్లో పాల్గొని జాబ్స్ను సాధిస్తారు. ఈ ప్రయత్నాల్లో ఉన్న వారికి మరో శుభవార్త. అగ్నివీర్ ద్వారా ఇంటర్ అర్హతతో ఈ నెల 8-18 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో ఓపెన్ ర్యాలీ జరగనుంది. తక్కువ వయసులో ఉద్యోగాలు పొందేందుకు ఇదో చక్కటి అవకాశం.
News March 5, 2026
SKLM: మార్చి 8న అస్మిత అథ్లెటిక్స్ పోటీలు

శ్రీకాకుళం నగరంలో మార్చి 8న కోడి రామ్మూర్తి స్టేడియంలో ‘అస్మిత’ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు మేరా యువ భారత్ డిప్యూటీ డైరెక్టర్ వెంకట్ ఉజ్వల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. 13-18 ఏళ్లున్న వారు అర్హులన్నారు. https://nsrs.kheloindia.gov.inలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
News March 5, 2026
టెక్కలి: విద్యార్థిని ఆత్మహత్య ఎందుకు చేసుకుందో?

టెక్కలి(M) తలగాం గ్రామ సమీపంలో బుధవారం <<19298091>>రైలు కింద పడి మృతి చెందిన<<>> ఇంజినీరింగ్ విద్యార్థిని కె.ప్రవల్లిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పట్టాలపై రైలుకు ఎదురుగా నడుచుకుంటూ వెళ్లిందని స్థానికులు తెలిపారు. అయితే ప్రవల్లిక ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఈ నెల 21న వివాహం జరగాల్సి ఉంది. ఇష్టం లేని పెళ్లి కారణమా? లేదా ఇతర బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయో తెలియాల్సి ఉంది.


