News March 9, 2025
మేజర్ సిటీగా ఏలూరును అభివృద్ధి చేస్తాం: ఎంపీ

ఏలూరు నగరాన్ని మేజర్ సిటీగా అభివృద్ధి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం సాయంత్రం జరిగిన టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశానికి ఎంపీ మహేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాజధాని అమరావతి అభివృద్ధితో ఏలూరు సిటీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని ఎంపీ పేర్కొన్నారు.
Similar News
News February 12, 2026
ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్లో 89 పోస్టులు

ఇండియన్ రేర్ ఎర్త్ లిమిటెడ్(<
News February 12, 2026
సిరిసిల్ల: కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజెషన్ ప్రక్రియ గురువారం పూర్తి చేశారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రక్రియను ఆమె పూర్తి చేశారు. కార్యక్రమంలో డీఈఓ జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
News February 12, 2026
GNT: చంద్రబాబును కలిసిన బండ్ల గణేశ్

సీఎం చంద్రబాబును సినీ నిర్మాత బండ్ల గణేశ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి క్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. పాదయాత్ర అనుభవాలను సీఎం అడిగి తెలుసుకొని అభినందించారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రసాదాన్ని ఆయన సీఎంకి అందించారు. .


