News February 3, 2025
మేడారంలో బోల్తాపడ్డ వాటర్ ట్యాంక్
తాడ్వాయి మండలం మేడారంలో వాటర్ ట్యాంకర్ బోల్తా పడింది. గ్రామ పంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ మొక్కలకు నీరు పోసేందుకు తీసుకు వెళ్తుండగా తాడ్వాయి – మేడారంలోని మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గ్రామ పంచాయతీ సిబ్బంది గజ్జల ఆశయ్య అనే వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం.
Similar News
News February 4, 2025
EWS ప్రయోజనాల కోసం ఇలా..: బీసీ మేధావుల ఫోరం
TG: కులసర్వేలో బీసీల జనాభా తగ్గడంపై BC మేధావుల ఫోరం పలు ప్రశ్నలు లేవనెత్తింది. 2014 సమగ్ర సర్వేలో బీసీల జనాభా 1.85 కోట్లు (51%) ఉంటే, ఇప్పుడు 1.64 కోట్లు (46.25%) మాత్రమే ఉందని ఫోరం నేతలు అన్నారు. BC, SC, ST, ముస్లింల జనాభా 25.98 లక్షలు తగ్గిందని, OCల జనాభా 15.89 లక్షలు పెరిగిందన్నారు. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. EWS ప్రయోజనాలను కాపాడేందుకు లేదా డేటా ఎంట్రీ సమస్య వల్ల ఇలా జరిగి ఉండొచ్చన్నారు.
News February 4, 2025
కామారెడ్డి: పరీక్షల షెడ్యూల్ విడుదల
కామారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాలలకు మార్చి 6 నుంచి 15 వరకు పదో తరగతి ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రాజు సొన్నైల తెలిపారు. పరీక్షలకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసిందన్నారు. పరీక్షలు మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 గంటల వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
News February 4, 2025
కిడ్నీలలో రాళ్లు చేరకూడదంటే..
*రోజుకు కనీసం 3 లీటర్ల నీరు తాగాలి.
*ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి.
*కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి.
*బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి.
*ఆల్కహాల్, స్మోకింగ్ జోలికి వెళ్లొద్దు.