News June 30, 2024

మేడారంలో భక్తుల సందడి

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క- సారలమ్మ వనదేవతలను దర్శించుకోవడానికి ఆదివారం భక్తులు భారీగా తరలివస్తున్నారు. జంపన్న వాగు వద్ద పుణ్యస్థానాలు ఆచరించిన భక్తులు తల్లుల గద్దెల వద్దకు చేరుకొని తల్లులకు ఇష్టమైన పసుపు, కుంకుమ, చీరె, సారె, బంగారం ( బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Similar News

News September 21, 2024

WGL: అండర్-19 జిల్లా జట్టు ఎంపిక

image

ఉమ్మడి వరంగల్ అండర్-19 జిల్లా జట్టు ఎంపిక పోటీలను ఈనెల 22, 23వ తేదీల్లో సికేఎం కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నారు. 2005 సెప్టెంబర్-1 తరువాత జన్మించిన ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులు క్రికెట్ యూనిఫాం, స్వంత కిట్, ఇతర పత్రాలతో హాజరుకావాలని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ కోరారు.

News September 21, 2024

గీసుగొండ: కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత: టీపీసీసీ అధ్యక్షుడు

image

కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్, ఇతర నేతలు నూతన అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.

News September 21, 2024

BREAKING.. జనగామ: తల్లిని చంపిన కుమారుడు

image

జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో కుమారుడు తల్లిని చంపాడు. స్థానికుల ప్రకారం.. కుమారుడు సత్తయ్య తల్లి సముద్రాల లక్ష్మమ్మ(65)ను రోకలిబండతో కొట్టి చంపాడు. అయితే సత్తయ్యకు కొంతకాలంగా మతిస్థిమితం లేనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.