News February 14, 2025
మేడారం జాతర.. మూడవ రోజు కొనసాగుతున్న మొక్కులు

మినీ మేడారం జాతరకు మూడవ రోజు శుక్రవారం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈనెల 12 నుంచి ప్రారంభమైన మినీ జాతర ఈనెల 15 వరకు జరగనుంది. ఈ మినీ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు.
Similar News
News November 11, 2025
మేడ్చల్ జిల్లాలో అత్యధిక చలి..అక్కడే!

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత గత మూడు రోజులుగా విపరీతంగా పెరుగుతుంది. ఘట్కేసర్ పరిధి కొండాపూర్లో అత్యల్పంగా 12.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొండాపూర్, ఘట్కేసర్, దేవరయంజాల, మల్కారం, ఉప్పల్, దూలపల్లి ఫారెస్ట్ ఏరియా, అలియాబాద్ ప్రాంతాల్లో అత్యధిక చలి ఉన్నట్లుగా TSRPS గ్రానులర్ రిపోర్ట్ గుర్తించింది.
News November 11, 2025
సీసీ కుంట: కురుమూర్తి జాతరలో రోడ్డు ప్రమాదం

చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని శ్రీ గురుమూర్తి స్వామి జాతర మైదానంలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న బైక్, ఆటో ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇచ్చినా ఆలస్యం కావడంతో క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడినవారు డోకుర్ బైక్, పేరూరు ఆటో డ్రైవర్లుగా పోలీసులు గుర్తించారు.
News November 11, 2025
BP ట్యాబ్లెట్స్ వాడటం మానేస్తున్నారా?

గత నెల రోజులుగా BP (అధిక రక్తపోటు) ట్యాబ్లెట్స్ మానేయడంతో అందెశ్రీ మరణించారని <<18254470>>వైద్యులు<<>> నిర్ధారించిన విషయం తెలిసిందే. ఇలా బీపీ ట్యాబ్లెట్స్ ఆపడం ప్రమాదమని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే రక్తపోటు అకస్మాత్తుగా పెరిగి, పక్షవాతం, గుండెపోటు వంటి తీవ్ర సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులను ఆపొద్దని/మార్చొద్దని, ఇది ప్రాణాపాయానికి దారితీయొచ్చని చెబుతున్నారు. SHARE IT


