News January 11, 2026

మేడారం: టూర్లతో పనులకు బ్రేకులు!

image

అసలే మేడారం జాతరకు టైమ్ లేదు. మరోపక్క ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇప్పటికే 7 సార్లు వచ్చిన మంత్రి పొంగులేటి, ఆదివారం మరోసారి వస్తున్నారు. ఆయనతో పాటుగా నలుగురు మంత్రులు వస్తుండటంతో జాతర పనులకు ఆటంకం ఏర్పడుతుందని కార్మికులు వాపోతున్నారు. అసలే సమయం లేకపోగా, మంత్రుల వరుస పర్యటనతో 3 నుంచి 4 గంటల పాటు పనులు నిలిచిపోతున్నాయి. మరోపక్క భక్తులు సైతం పోటెత్తుండటంతో ఈ పనులు కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు.

Similar News

News January 17, 2026

పాలమూరులో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: CM

image

పాలమూరు గడ్డపై నిర్వహించిన బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేసిందని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రధాని మోదీని కలిసేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

News January 17, 2026

DRDOలో JRF, RA పోస్టులు

image

<>DRDO<<>>కు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ & స్టోర్స్ రీసెర్చ్& డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (DMSRDE) 3 పోస్టులను భర్తీ చేయనుంది. PhD(కెమిస్ట్రీ), పీజీ, బీఈ, బీటెక్/ ఎంఈ, ఎంటెక్, NET, GATE అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 12న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. JRFకు గరిష్ఠ వయసు 28ఏళ్లు కాగా, రీసెర్చ్ అసోసియేట్‌కు 35ఏళ్లు. RAకు స్టైపెండ్ నెలకు రూ.67వేలు, JRFకు 37వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.drdo.gov.in

News January 17, 2026

ఏలూరు: రైలు ఢీకొని మహిళ మృతి

image

ఏలూరు నగరంలోని రామకృష్ణపురం వద్ద రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వివాహిత మృతి చెందింది. మృతురాలిని గొల్లగూడెంకు చెందిన ఐ.ప్రియాంక(27)గా గుర్తించారు. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరగగా.. వివరాలు ఆలస్యంగా వెలుగుచూశాయి. మృతురాలికి ఇద్దరు సంతానం. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.