News February 4, 2025

మేడారం మినీ జాతర.. RTC శుభవార్త

image

ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం, ఐలాపురం, కొండాయి జాతరలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు మేడారానికి 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News November 10, 2025

గురుకుల విద్యార్థులకు “నీట్” పరీక్షకు ఉచిత శిక్షణ

image

ఏలూరు జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని నీట్ కు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గురుకులాల జిల్లా సమన్వయ అధికారి ఉమ కుమారి సోమవారం ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో శిక్షణ ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 10, 2025

వ్యక్తిగత ప్రదర్శన ముఖ్యం కాదు: గంభీర్

image

హెడ్ కోచ్‌గా తనకు జట్టు ప్రదర్శనే ముఖ్యమని గంభీర్ తెలిపారు. ‘క్రికెట్ వ్యక్తిగత ప్రదర్శనకు సంబంధించింది కాదని నమ్ముతాను. మేము ODI సిరీస్ ఓడిపోయాం. కోచ్‌గా ఇండివిడ్యువల్ గేమ్‌ను మెచ్చుకోవచ్చు. ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా సిరీస్ ఓటమిని సెలబ్రేట్ చేసుకోలేను. T20 సిరీస్‌‌ వేరే.. అందులో గెలిచాం. దానిలో చాలా పాజిటివ్స్ ఉన్నాయి. కానీ WCకి ముందు మేమనుకున్న చోట లేము’ అని తెలిపారు.

News November 10, 2025

కామారెడ్డి: జాతీయ రహదారుల భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

image

జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులు, నష్టపరిహారం చెల్లింపులపై KMR కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. NH–765D ప్రాజెక్టు కింద మెదక్ నుంచి ఎల్లారెడ్డి (ప్యాకేజ్-1) వరకు అవార్డులు పూర్తయ్యాయని తెలిపారు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ (ప్యాకేజ్-2) భూసేకరణను పూర్తి చేసి, రైతులకు నష్టపరిహారం త్వరగా అందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.