News February 4, 2025

మేడారం మినీ జాతర.. RTC శుభవార్త

image

ములుగు జిల్లాలో జరిగే మినీ మేడారం, ఐలాపురం, కొండాయి జాతరలకు ఆర్టీసీ అధికారులు శుభవార్త చెప్పారు. ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు మేడారానికి 100 బస్సులు, 400 ట్రిప్పులు నడపనున్నట్లు రీజినల్ మేనేజర్ విజయభాను తెలిపారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి బస్సులు ప్రారంభమవుతాయన్నారు. అమ్మవార్ల దర్శనానికి వెళ్లే భక్తులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News April 11, 2026

కేయూ ఎంఫార్మసీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

image

KU ఎంఫార్మసీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల కాలపట్టికను వర్సిటీ పరీక్షల నియంత్రణ విభాగం శనివారం విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌ విద్యార్థులతో పాటు పాత నియమావళి సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 23, 25, 27, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.

News April 11, 2026

చర్చిలో TTD బోర్డు సభ్యుడి భార్య ప్రార్థనలు!

image

కర్ణాటకకు చెందిన TTD బోర్డు సభ్యుడు దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేసినట్లు హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన భార్య, కుమారుడు చర్చిలో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. TTDలో అన్యమతాలకు చెందిన ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బోర్డు సభ్యుడి కుటుంబ సభ్యులు చర్చిలో ఉన్న ఫొటోలు బయటకు రావడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

News April 11, 2026

టీ కొట్టు నుంచి మాల్స్ వరకు.. ‘UPI’కి పదేళ్లు!

image

ఇండియన్ డిజిటల్ పేమెంట్స్‌కు చిరునామాగా మారిన UPIకి నేటితో పదేళ్లు. 2016లో NPCI ప్రారంభించిన ఈ వ్యవస్థ నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా యూజర్లు, 504 బ్యాంకులు, 6.5 కోట్ల మంది వ్యాపారులతో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ పేమెంట్ వ్యవస్థగా అవతరించింది. టీ కొట్టు నుంచి మాల్స్ వరకు ప్రతిచోటా ఫోన్ ద్వారా సులభంగా డబ్బులు పంపేలా UPI మన జీవితాలను మార్చేసింది.