News February 12, 2025
మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి

ఘట్కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్పేట, జవహర్నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.
Similar News
News November 12, 2025
MBNR: అథ్లెటిక్స్ ఎంపికలకు 350 మంది హాజరు

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, 17 విభాగాల్లో అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన వారు నవంబర్ 14 నుంచి 16 వరకు రంగారెడ్డి జిల్లాలోని జింఖానా మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
News November 12, 2025
భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఇటలీ జంట

భారతీయ సంప్రదాయంపై నమ్మకంతో ఇటలీ నుంచి వచ్చిన జంట కాశీలో వివాహం చేసుకున్నారు. పెళ్లి కూతురు యాంటీలియా, పెళ్లి కొడుకు గ్లోరియస్ సనాతన సంప్రదాయం ప్రకారం నవదుర్గ ఆలయంలో ఒక్కటయ్యారు. ఆచార్య మనోజ్ మంత్రాలు చదువుతుండగా ఈ జంట దండలు మార్చుకుని, బొట్టు పెట్టుకుని, అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచింది. ఏడాది క్రితం వీరు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నపట్పికీ ఇప్పుడు భారతీయ సంప్రదాయంలో వివాహమాడటం గమనార్హం.
News November 12, 2025
విజయవాడ: రోగులు ఫుల్.. సిబ్బంది నిల్..!

విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. అన్ని విభాగలకు కలిపి 85 మంజూరు పోస్టులు ఉండగా కేవలం 36 మంది మాత్రమే ఉన్నారు. అనేక ప్రాంతాల నుంచి రోగులు అనేక మంది వస్తున్నారని, సిబ్బంది కొరతతో వైద్య సేవలు అందించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి అపాయింట్మెంట్ తీసుకొని మరి వివిధ అనారోగ్య సమస్యలు ఉన్న బాధితులు వస్తున్నారని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు.


