News February 13, 2025

మేడిపల్లి: 2024లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్.. 292 మంది మృతి

image

ఘట్‌కేసర్, మేడిపల్లి, కీసర, మేడ్చల్, శామీర్‌పేట, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 2024లో ఏకంగా 683 ప్రమాదాల్లో 292 మంది మృత్యుపాలయ్యారు. అనేక ప్రమాదాల్లో అతివేగంగా ప్రయాణించడం, హెల్మెట్, సీటు బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ కారణాలుగా పోలీసు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రయాణంలో చేసే చిన్నపాటి తప్పిదం ప్రాణాలు తీస్తుందని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.

Similar News

News November 1, 2025

మందమర్రి: ఏరియాలో 65% బొగ్గు ఉత్పత్తి

image

అక్టోబర్ నెలకు గాను మందమర్రి ఏరియాలో నిర్దేశించిన లక్ష్యానికి 65% బొగ్గు ఉత్పత్తి సాధించామని జీఎం రాధాకృష్ణ చెప్పారు. బొగ్గు ఉత్పత్తి వివరాలను శుక్రవారం వెల్లడించారు. భూగర్భ గనుల కార్మికుల గైర్హాజర్ మూలంగా ఆశించిన బొగ్గు ఉత్పత్తి సాధించడం లేదన్నారు. రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారులు సూపర్వైజర్లు సమష్టిగా కృషి చేయాలన్నారు.

News November 1, 2025

ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు: Dy.CM

image

TG రైజింగ్, రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా పాలన విజయోత్సవాలు (DEC 1-9) నిర్వహించాలని Dy.CM భట్టి అన్నారు. భవిష్యత్తులో TG ఏం సాధించబోతుందనే విషయాలను ప్రపంచానికి వివరించేలా కార్యక్రమాలు ఉండాలని సమీక్ష సమావేశంలో అధికారులకు సూచించారు. విజయోత్సవాలకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని, భారీగా MOUలు జరిగేలా వాతావరణం ఉండాలన్నారు.

News November 1, 2025

హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలి: KMR DEO

image

జుక్కల్ నియోజకవర్గంలో కొందరు ఉపాధ్యాయులు హెడ్‌క్వార్టర్స్‌‌లో ఉండటం లేదని, పాఠశాల సమయాల్లో బయటకు వెళ్తున్నారని MLA కాంతారావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కామారెడ్డి జిల్లా విద్యాధికారి ఎస్‌.రాజు అన్ని మండల విద్యాధికారులు, హెడ్‌మాస్టర్లు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, పాఠశాల సమయాల్లో స్కూల్ వదిలి వెళ్లకూడదని ఉత్తర్వులు జారీ చేశారు.