News April 2, 2025
మేడ్చల్లో చల్లబడింది.. వర్షం కురిసే CHANCE

మేడ్చల్ వాతావరణంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు తగ్గడంతో గరిష్ఠంగా 37.7 డిగ్రీలు నమోదైంది. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ వర్షం రైతులకు ఊరట కలిగించనుంది. అయితే రోడ్లపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉప్పల్ లాంటి ప్రాంతాల్లో వెదర్ చల్లబడింది. స్థానికంగా చల్లని గాలులు వీస్తున్నాయి. మీ ప్రాంతంలో ఎలా ఉంది కామెంట్ చేయండి.
Similar News
News April 10, 2025
ఎంపీ మేడాకు నోటీసులు

MP మేడా రఘునాథరెడ్డి, మాజీ MLA మేడా మల్లిఖార్జునరెడ్డిలకు JC రాజేంద్రన్ నోటీసులు జారీ చేశారు. వీరు నందలూరు (M) లేబాకలో పేదల పేరుతో అక్రమంగా దాదాపు 109 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారనే ఆరోపణల కారణంగా నోటీసులు ఇచ్చారు. దీనిపై సరైన వివరణ ఇవ్వకుంటే చర్యలు తీసుకుంటామని JC హెచ్చరించారు.
News April 10, 2025
ఆదిలాబాద్ ట్రైనీ కలెక్టర్గా సలోని చాబ్రా

ఆదిలాబాద్ జిల్లాకు ట్రైనీ కలెక్టర్గా 2024 ఐఏఎస్ బ్యాచ్ అధికారిణి సలోని చాబ్రాను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ నిమిత్తం జిల్లాకు రానున్న ఆమె ఏడాది పాటు ఇక్కడ అందుబాటులో ఉండనున్నారు. మే 2న కలెక్టర్ రాజర్షి షాను కలిసి రిపోర్టు చేయనున్నట్లు సమాచారం. ఇది వరకు ఇక్కడ ట్రైనీ కలెక్టర్గా అభిగ్యాన్ మాలవియా ఉన్నారు.
News April 10, 2025
రేగిడి: పోక్సో కేసులో నలుగురి అరెస్ట్

విజయనగరం జిల్లా రేగిడి మండలానికి చెందిన జగదీశ్ ఈనెల 26న అదే మండలానికి చెదిన బాలికను ప్రేమ పేరుతో విజయవాడ తీసుకెళ్లిపోయాడు. బాలిక కనబడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో యువకుడు బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తేలడంతో జగదీశ్తో పాటు అతనికి సాయం చేసిన మరో ముగ్గురిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు బుధవారం తెలిపారు.