News April 2, 2025

మేడ్చల్: అబ్రుక్‌ కాయితం ఆగవట్టలేమా?

image

అబ్రుక్ కాయితం వాడుడు జోరైతుంది. ప్లాస్టిక్ ముట్టంది దినం గడుస్తలేదు. మేడ్చల్ జిల్లా అంతా యాడ చూసినా ఇది అగుపిస్తుంది. పొద్దున పాల ప్యాకెట్ కెళ్లి షురూ జేస్తే సగులం ప్లాస్టిక్కే. అగ్గువకు దొరుకుడుతోని శితం వాడి, బయటేస్తున్నరు. ఏండ్ల కమానం భూమిల కల్శిపోక గుట్టలకు గుట్లు జమైతుంది. ప్లాస్టిక్ కడుపులకు జొర్రి అడ్డమైన క్యాన్సర్ బీమార్లు అంటుకుంటున్నయ్. సర్కార్ బంద్ వెట్టినా, నజరేయక అమలైతలేదు.

Similar News

News September 16, 2025

డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలి: CBN

image

AP: మహిళా సాధికారత కోసం తీసుకువచ్చిన డ్వాక్రా సంఘాలు మరింత ఎత్తుకు ఎదగాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. ‘కోటీ 20 లక్షల మంది అతిపెద్ద మహిళా సైన్యం డ్వాక్రా సంఘాల రూపంలో రాష్ట్రానికి ఉంది. నేను ప్రారంభించిన ఈ సంఘాలను ఎవరూ ఏం చేయలేకపోయారు. మహిళా సంఘాలకు రుణం ఇస్తే డబ్బులు బ్యాంకులో ఉన్నట్టే. డ్వాక్రా సంఘాల టర్నోవర్ రూ.10 లక్షల కోట్లకు ఎదగాలని ఆశిస్తున్నా’ అని తెలిపారు.

News September 16, 2025

సిరిసిల్ల: ‘మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు మరువలేనివి’

image

సిరిసిల్లలోని కలెక్టరేట్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే వేడుకలను అధికారులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీవో జిల్లా అధ్యక్షుడు సమరసేన్ మాట్లాడుతూ.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య దేశ నిర్మాణం కోసం చేసిన సేవలు ఎన్నటికీ మరువలేని కొనియాడారు. ఆయన నిర్మించిన సాగునీటి, తాగునీటి కట్టడాలు ఆయనకున్న పట్టుదల నిజాయితీని ప్రపంచం కీర్తించిందని పేర్కొన్నారు.

News September 16, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 9 అర్జీలు: ఎస్పీ

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మీ అన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రులోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా వేదికకు 9 అర్జీలు వచ్చాయన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.