News January 26, 2025
మేడ్చల్: ఇందిరమ్మ ఇళ్ల కోసం 1.43 లక్షల దరఖాస్తులు

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు కావాలని మొత్తం 1,43,267 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 1.మేడ్చల్ 2.మల్కాజిగిరి 3.కూకట్పల్లి 4.కుత్బుల్లాపూర్ 5. ఉప్పల్ నియోజకవర్గాలు కాగా..ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొదటి దశలో కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మొదటి దశలో జిల్లాకు 17,500 ఇళ్లు రానున్నాయి.
Similar News
News December 21, 2025
అంటే.. ఏంటి?: Wunderkind

చిన్నవయసులో అసాధారణ ప్రతిభ గల, విజయాలు సాధించిన వారి గురించి చెప్పేటప్పుడు వారిని Wunderkind పర్యాయ పదంతో ప్రస్తావిస్తారు. జర్మన్ భాషలోని Wunder (wonder), Kind (child) పదాల నుంచి ఇది పుట్టింది.
Ex: AI Wunderkind Alexander Wang..
28సం.ల అలెగ్జాండర్ వాంగ్ స్కేల్ AI సంస్థను స్థాపించగా $14.8 బిలియన్లు చెల్లించి జుకర్బర్గ్ అందులో 49% వాటా కొన్నారు. (రోజూ 12pmకు అంటే ఏంటి పబ్లిష్ అవుతుంది)
<<-se>>#AnteEnti<<>>
News December 21, 2025
హైడ్రా కమిషనర్ గన్మెన్ ఆత్మహత్యాయత్నం

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేశారు. హయత్నగర్లోని నివాసంలో గన్తో కాల్చుకుని ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెంటనే ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. బెట్టింగ్ యాప్లో భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణచైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
News December 21, 2025
రూ.800 కోట్లతో తిరుపతి బస్టాండ్ నిర్మాణం..?

తిరుపతి బస్టాండ్ను అంతర్జాతీయ ప్రమాణాలతో పునర్నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. RTC, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో(PPP) ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. NHML, RTC సంయుక్తంగా ప్రతిపాదించిన మోడల్ను CMకు పంపగా కొన్ని మార్పులతో ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుకు రూ.600 నుంచి రూ.800 కోట్లు ఖర్చు చేయనున్నారు. తిరుపతిలో సోమవారం జరిగే సమావేశంలో ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించనున్నారు.


