News February 18, 2025
మేడ్చల్: క్రమశిక్షణ చర్యలు.. MRO బదిలీ

మేడ్చల్ MRO శైలజ బదిలీ అయ్యారు. ఆమెను నాగర్కర్నూల్ జిల్లాకు బదిలీ చేస్తూ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ గౌతమ్ సూచనల మేరకు క్రమశిక్షణ చర్యల కింద ఆమెను బదిలీ చేసినట్లుగా పేర్కొన్నారు. కొంతకాలంగా ఆమె బదిలీపై ఊహాగానాలు జోరందుకోగా చివరకు FEB 8 తేదినే ఆమె బదిలీ అయినట్లు తెలుస్తోంది. కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఆమె వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.
Similar News
News November 6, 2025
జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో ధరలు

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేడు పలికిన వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2,051, కనిష్ఠ ధర రూ.1,700, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.1,901, కనిష్ఠ ధర రూ.1,775, వరి ధాన్యం (BPT) గరిష్ఠ ధర రూ.2,061, కనిష్ఠ ధర రూ.1,910, వరి ధాన్యం (HMT) ధర రూ.1,850, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2,480, కనిష్ఠ ధర రూ.1,850గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.
News November 6, 2025
మామిడికి బోరాన్ ఎలా అందిస్తే మంచిది?

బోరాన్ను మామిడి మొక్క/చెట్లపై పిచికారీ చేసినప్పుడు లేత, మృదువైన మొక్క బాగాలు, ఆకులు, రెమ్మలు, పూత బాగా పీల్చుకుంటాయి. అంటే చెట్లలో కొత్త చిగుర్లు వచ్చినప్పుడు పూ మొగ్గలు, పూత, లేత పిందెల సమయంలో చెట్లపై బోరాన్ పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. చెట్లలో ముదురు ఆకులు ఉన్నప్పుడు, చెట్లు నిద్రావస్థలో ఉన్నప్పుడు (అక్టోబర్-నవంబర్) బోరాన్ను భూమికి వేసుకోవడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News November 6, 2025
వర్గల్: ‘మందుల కొరత లేకుండా చూడండి’

వర్గల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్, ఓపి రిజిస్టర్ వెరిఫై చేశారు. పెద్ద ఆసుపత్రి కావున ఓపీ పెంచాలని, మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్ను ఆదేశించారు. పాత ఆసుపత్రి నుంచి పర్నిచర్ షిప్ట్ చేయించాలని, మెడిసిన్ కొరత లేకుండా సప్లై చేయాలని DMHOను ఫోన్లో ఆదేశించారు.


