News January 26, 2025

మేడ్చల్: జిల్లాలో ఇంటి స్థలం 8,193 మందికే..!

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 1.4 లక్షల మంది తమకు ఇందిరమ్మ ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి 8,193 మందికి ఇంటి స్థలాలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. అయితే మొదటి దశలో ఇంటి స్థలం ఉన్నవారికే ఇళ్లు కేటాయిస్తామని, తర్వాత మిగతా వారికి కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది.

Similar News

News September 18, 2025

ఇవాళ ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

ప్రకాశం జిల్లాకు గురువారం సైతం మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం సాయంత్రం ప్రకటించింది. కాగా బుధవారం ప్రకాశం జిల్లాలోని పలు మండలాలలో జోరు వానలు కురిసిన విషయం తెలిసిందే. ప్రధానంగా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గురువారం కూడా వర్ష సూచన ఉండడంతో, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News September 18, 2025

శుభ సమయం (18-09-2025) గురువారం

image

✒ తిథి: బహుళ ద్వాదశి రా.12.25 వరకు
✒ నక్షత్రం: పుష్యమి ఉ.8.59 వరకు
✒ శుభ సమయములు: ఏమీ లేవు
✒ రాహుకాలం: మ.1.30-మ.3.00
✒ యమగండం: ఉ.6.00-ఉ.7.30
✒ దుర్ముహూర్తం: ఉ.10.00-ఉ.10.48, మ.2.48-మ.3.36
✒ వర్జ్యం: సా.5.29-సా.7.02
✒ అమృత ఘడియలు: ఉ.6.38-ఉ.8.10

News September 18, 2025

కానిస్టేబుల్ నుంచి టీచర్లుగా..

image

నందికొట్కూరు సర్కిల్ పరిధిలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఎస్.నాగ మల్లయ్య, ఎం.జ్యోతి డీఎస్సీలో ఉత్తీర్ణులై టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. నాగ మల్లయ్య నందికొట్కూరు, జ్యోతి బ్రాహ్మణ కొట్కూరు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం వీరిని రూరల్ సీఐ సుబ్రహ్మణ్యం సన్మానించి, అభినందించారు.