News January 26, 2025
మేడ్చల్: జిల్లాలో ఇంటి స్థలం 8,193 మందికే..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 1.4 లక్షల మంది తమకు ఇందిరమ్మ ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి 8,193 మందికి ఇంటి స్థలాలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. అయితే మొదటి దశలో ఇంటి స్థలం ఉన్నవారికే ఇళ్లు కేటాయిస్తామని, తర్వాత మిగతా వారికి కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Similar News
News February 13, 2025
నెల్లూరు జిల్లాలో మరో రేప్ అటెంప్ట్!

వెంకటాచలం మండలంలోని విద్యార్థినిపై రేప్ అటెంప్ట్ జరిగిన విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ స్కూల్లో చదివే విద్యార్థులే ఆ విద్యార్థినిపై లైంగిక దాడి చేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 13, 2025
పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్: మంత్రి

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. HYD విశ్వనగరమని, పెట్టుబడులకు గమ్యస్థానమని అన్నారు. మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.
News February 13, 2025
HYD: 500 పాఠశాలల్లో AI బోధనకు కృషి: సీఎం

గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. 500 పాఠశాలల్లో ఏఐ బోధనకు కృషి చేస్తున్నామని, HYDతో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుభవం ఉందన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్దే అని పేర్కొన్నారు.