News January 27, 2025
మేడ్చల్ జిల్లాలో కొత్తగా 33,435 రేషన్ దరఖాస్తు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో కొత్తగా 33,435 మంది రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నట్లుగా జిల్లా యంత్రాంగం వెల్లడించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ప్రభుత్వ ఆదేశాలతో ముందుకు వెళ్తామని తెలిపారు. మరోవైపు ఇప్పటికే గత ప్రజాపాలన దరఖాస్తుల ప్రకారం రూపొందించిన లిస్టులోని అర్హులైన వారికి రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించారు.
Similar News
News October 20, 2025
దీపావళి సమయంలోనే ఆలయానికి ఎంట్రీ

కర్ణాటకలోని చిక్కమగళూరులో కొండపై ఉన్న దేవిరామ్మ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. స్థానిక ఆచారం ప్రకారం దీపావళి సందర్భంగా మాత్రమే ఈ ఆలయంలోకి భక్తులను అనుమతిస్తారు. ఈ ఏడాది నైట్ ట్రెక్కింగ్పై నిషేధం విధించి నిన్న, ఇవాళ దర్శనానికి అనుమతించారు. ఈ క్రమంలో నిన్న భక్తులు కొండను ఎక్కుతున్న సమయంలో డ్రోన్తో తీసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు రావడం గమనార్హం.
News October 20, 2025
జూబ్లీహిల్స్లోనే కాంగ్రెస్ పార్టీకి మొదటి దెబ్బ: కేటీఆర్

TG: కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో BRS మొదటి దెబ్బ కొట్టబోతుందని తెలంగాణ భవన్లో ఆ పార్టీ నేత కేటీఆర్ అన్నారు. రెండో దెబ్బ రాజేంద్రనగర్ లేదా ఖైరతాబాద్లో కొడుతామన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారని విమర్శలు చేశారు. ఫిరాయింపు స్థానాల్లో ఉపఎన్నికలు ఖాయమని స్పష్టం చేశారు. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికకు రావాలని సవాల్ విసిరారు.
News October 20, 2025
రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్కు గద్వాల బిడ్డ కెప్టెన్

గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం జడ్పీహెచ్ఎస్ నందిన్నెలో చదువుతున్న మహేశ్వరి తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ టీమ్కు కెప్టెన్గా ఎంపికైంది. దీంతో ఆమెను ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్, పీఈటీ అమ్రేష్ బాబు, తల్లిదండ్రులు అభినందించారు. మహేశ్వరి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మండల ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.