News January 27, 2025

మేడ్చల్ జిల్లాలో కొత్తగా 33,435 రేషన్ దరఖాస్తు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో కొత్తగా 33,435 మంది రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నట్లుగా జిల్లా యంత్రాంగం వెల్లడించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ప్రభుత్వ ఆదేశాలతో ముందుకు వెళ్తామని తెలిపారు. మరోవైపు ఇప్పటికే గత ప్రజాపాలన దరఖాస్తుల ప్రకారం రూపొందించిన లిస్టులోని అర్హులైన వారికి రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించారు.

Similar News

News July 8, 2025

రేపు కార్మిక సంఘాల భారత్ బంద్

image

కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ 10 కార్మిక సంఘాలు, అనుబంధ సంఘాల ఐక్యవేదిక రేపు (జులై 9) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బ్యాంకింగ్, పోస్టల్, ఇన్సూరెన్స్ వంటి రంగాలకు చెందినవారు బంద్‌లో పాల్గొననున్నారు. రైతులతో కలిపి 25 కోట్ల మంది పాల్గొంటారని ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేత తెలిపారు. 10ఏళ్లుగా వార్షిక కార్మిక సమావేశం పెట్టకుండా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఆరోపించారు.

News July 8, 2025

గోదావరికి వరద ఉద్ధృతి

image

AP: శబరి, సీలేరు వరదతో గోదావరి నదిలో ప్రవాహం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు వద్ద 48 గేట్లు ఎత్తి 1.95 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. అటు ధవళేశ్వరం బ్యారేజీకి 2.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మహారాష్ట్రలో వర్షాలు మరింత ఊపందుకుంటాయని, 3-4 రోజుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

News July 8, 2025

ఈ లక్షణాలుంటే కఠిక పేదరికమే: చాణక్య నీతి

image

ఏ ఇంట్లో స్త్రీకి సముచిత స్థానం, తగిన మర్యాద దక్కదో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చాణక్య నీతి చెబుతోంది. అహంకారం, మోసం చేసే గుణాలున్న వారు మొదట లాభపడవచ్చు. కానీ, వారింట లక్ష్మి నిలవదు. పరిస్థితిని అంచనా వేయకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వ్యాపారి, ఉద్యోగి ఇబ్బందులు పడక తప్పదు. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం ఉండదని చాణక్య నీతిలో ఉంది.