News February 17, 2025

మేడ్చల్ జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు భూగర్భజలాలు పడిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రెండు నెలల్లో 1.8 మీటర్లకు పైగా భూగర్భ జలం పడిపోయిందని పేర్కొన్నారు. రాబోయే వేసవికాలంలో మరింత అట్టడుగు స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లుగా భూగర్భజల శాఖకు సంబంధించిన అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి నెల నెల పీజో మీటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 17, 2025

నంద్యాల: పీజీఆర్ఎస్‌కు 81 ఫిర్యాదులు

image

నంద్యాలలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 81 ఫిర్యాదులను స్వీకరించినట్లు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు తెలిపారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన అధికారులను ఆదేశించారు.

News November 17, 2025

నంద్యాల: పీజీఆర్ఎస్‌కు 81 ఫిర్యాదులు

image

నంద్యాలలోని బొమ్మలసత్రం వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుంచి మొత్తం 81 ఫిర్యాదులను స్వీకరించినట్లు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్. యుగంధర్ బాబు తెలిపారు. చట్ట పరిధిలో ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించరాదని ఆయన అధికారులను ఆదేశించారు.

News November 17, 2025

బోసిపోయిన భూపాలపల్లి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం

image

ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా రిజస్టర్, సబ్ రిజిస్టర్ కార్యాలయల్లో జరిగిన ఏసీబీ దాడుల తర్వాత భూపాలపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం బోసిపోయింది. భూపాలపల్లిలో రెండు రోజులుగా డాక్యుమెంట్, రైటర్ షాపులు తెరుచుకోక పోవడంతో భూమి క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మ్యారేజీ రిజిస్ట్రేషన్లు మాత్రమే కొనసాగుతున్నాయి.