News February 17, 2025
మేడ్చల్ జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు భూగర్భజలాలు పడిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రెండు నెలల్లో 1.8 మీటర్లకు పైగా భూగర్భ జలం పడిపోయిందని పేర్కొన్నారు. రాబోయే వేసవికాలంలో మరింత అట్టడుగు స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లుగా భూగర్భజల శాఖకు సంబంధించిన అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి నెల నెల పీజో మీటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
తొలి విడత.. ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్!

TG: రాష్ట్రంలో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. అభ్యర్థులకు తెలుగు అక్షర క్రమం ఆధారంగా EC గుర్తులు కేటాయించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి 30 మంది సర్పంచ్లు ఏకగ్రీవమైనట్లు అధికారవర్గాలు తెలిపాయి. మొత్తంగా 400కుపైగా స్థానాలు ఏకగ్రీవమవుతాయని అంచనా వేశాయి. రెండో విడతలో 4,332 సర్పంచ్ స్థానాలకు 28,278 మంది, 38,342 వార్డు స్థానాలకు 93,595 మంది నామినేషన్లు వేసినట్లు సమాచారం.
News December 4, 2025
సంగారెడ్డి: సమస్యాత్మక ప్రాంతాలు.. కలెక్టర్ కీలక సూచనలు

సంగారెడ్డి జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
News December 4, 2025
ఏలూరు: GOOD NEWS నెలకు రూ.12,500 వేతనం

ఏలూరు జిల్లా వ్యాప్తంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ బుధవారం తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు MEO కార్యాలయంలో డిసెంబర్ 5 తేదీలోపు దరఖాస్తు సమర్పించాలన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు రూ.12,500, ఎస్జీటీ పోస్ట్కు రూ.10 వేల వేతనం ఇవ్వబడుతుందన్నారు. ఏలూరులో 4, కలిదిండిలో 1, కైకలూరులో 1, నూజివీడులో 1 పోస్టు ఉందన్నారు.


