News February 17, 2025
మేడ్చల్ జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు భూగర్భజలాలు పడిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రెండు నెలల్లో 1.8 మీటర్లకు పైగా భూగర్భ జలం పడిపోయిందని పేర్కొన్నారు. రాబోయే వేసవికాలంలో మరింత అట్టడుగు స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లుగా భూగర్భజల శాఖకు సంబంధించిన అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి నెల నెల పీజో మీటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
ASPT: మనవడి మరణం తట్టుకోలేక నాయనమ్మ మృతి

అశ్వారావుపేట మండలం దొంతికుంటలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో వాగులో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థి యశ్వంత్ (15) ఈత రాక మునిగి మృతి చెందాడు. మనవడి మరణవార్త విని తట్టుకోలేక నాయనమ్మ వెంకమ్మ (65) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. గంటల వ్యవధిలో ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
News November 24, 2025
వరంగల్: డిసెంబర్ బియ్యం కోటా విడుదల

ఉమ్మడి జిల్లాలో రేషన్ షాపులకు సన్న బియ్యం అలాట్ అయ్యింది. HNK జిల్లాకు 4,789.54 మెట్రిక్ టన్నులు, జనగామ 3,548.47, భూపాలపల్లి 2,526.02, మహబూబాబాద్ 5,209.91, ములుగు 1,906.28, WGL 5,509.8 మెట్రిక్ టన్నులను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,10,124.53 మెట్రిక్ టన్నుల కోటాను డిసెంబరు కోసం విడుదల చేశారు. పంచాయతీ ఎన్నికలున్న నేపథ్యంలోనే ముందుగానే సన్నబియ్యాన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నారు.
News November 24, 2025
శ్రీశైలంలో డైరెక్టర్ సుకుమార్

ప్రముఖ సినీ డైరెక్టర్ సుకుమార్ సోమవారం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న ఆయనకు అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద ఆశీర్వచనాలు చేసి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు, స్థానికులు సుకుమార్తో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.


