News January 25, 2025

మేడ్చల్ జిల్లాలో వారికి ఏటా రూ.12 వేలు..!

image

మేడ్చల్ జిల్లాలో భూమిలేని వ్యవసాయ నిరుపేద కూలీలకు ఏటా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరిట రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ నేపథ్యంలో డీఆర్డీఓ అధికారులు సర్వే చేసి 1074 మంది అర్హులైన లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ప్రభుత్వం రేపటి నుంచే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తాజాగా ప్రకటించింది.

Similar News

News November 13, 2025

నెల్లూరు జిల్లా వాసికి కీలక పదవి

image

నెల్లూరు(D) విడవలూరుకు చెందిన సుమంత్ రెడ్డిని TTD ఢిల్లీ దేవాలయ స్థానిక సలహా కమిటీ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దేశ రాజధానిలోని ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ప్రతి వారం వేలాది మంది భక్తులను దర్శించుకుంటారు. ఇటీవలే సుమంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం సుమంత్ మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈయన నెల్లూరు DCMS ఛైర్మన్ గానూ పని చేశారు.

News November 13, 2025

కురుపాం ఘటన.. కేజీహెచ్‌లో NHRC విచారణ

image

కురుపాం గురుకులంలో జాండిస్‌ బారిన పడి బాలికలు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (NHRC) బృందం గురువారం కేజీహెచ్‌‌లో విచారణ చేపట్టింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఈ సందర్భంగా కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ వైద్య సేవల వివరాలు, పరీక్షల నివేదికలు, తీసుకున్న జాగ్రత్తలు బృందానికి వివరించారు. కాగా నిన్న కురుపాం పాఠశాలను ఈ బృందం సందర్శించింది.

News November 13, 2025

HYD: రాబోయే రోజుల్లో చెమట సుక్కలే..!

image

ఏటా ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నట్లు పర్యావరణ శాస్త్రవేత్తలు గుర్తించారు. మహానగరంలో నిర్మాణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కాంక్రీట్ జంగల్‌గా మారుతుంది. ఈ నేపథ్యంలో గత పదేళ్ల రిపోర్టును పరిశీలించిన అధికారులు రాబోయే రోజుల్లో 47, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలో నమోదైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు.