News January 25, 2025

మేడ్చల్ జిల్లాలో వారికి ఏటా రూ.12 వేలు..!

image

మేడ్చల్ జిల్లాలో భూమిలేని వ్యవసాయ నిరుపేద కూలీలకు ఏటా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరిట రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ నేపథ్యంలో డీఆర్డీఓ అధికారులు సర్వే చేసి 1074 మంది అర్హులైన లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ప్రభుత్వం రేపటి నుంచే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తాజాగా ప్రకటించింది.

Similar News

News November 26, 2025

MDK: ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి: SEC

image

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో వీసీ నిర్వహించి, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. టి-పోల్‌లో రిజర్వేషన్లు, పోలింగ్ కేంద్రాల వివరాలు అప్‌డేట్ చేయాలని, ఫిర్యాదులు మూడు రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. నామినేషన్లు నవంబర్ 27–29 స్వీకరణపై మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పారు.

News November 26, 2025

BREAKING: వరంగల్: ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ సస్పెండ్

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో ఇన్‌స్పెక్టర్ ఓ.రమేష్, కానిస్టేబుల్ జి.రఘును సస్పెండ్ చేస్తూ సీపీ సన్ ప్రీత్ ఉత్తర్వులు జారీ చేశారు. మామూనూరు పీఎస్ నుంచి కంట్రోల్ రూమ్‌కు బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ రమేష్‌తో పాటు, కానిస్టేబుల్ రఘుపై వచ్చిన ఆరోపణలు అధికారుల విచారణలో నిర్ధారణ అయ్యాయి. దీంతో సీపీ ఈ చర్య తీసుకున్నారు.

News November 26, 2025

మున్సిపాల్టీల విలీనంతో HMDA ఆదాయానికి గండి

image

గ్రేటర్‌లో మున్సిపాల్టీల విలీనం తరువాత HMDA ఆదాయం కోల్పోనుంది. ప్రస్తుతం శివారు ప్రాంతాల మున్సిపాలిటీల నుంచి HMDAకు ఆదాయం అధికంగా వస్తోంది. కేబినెట్ నిర్ణయంతో 27 మున్సిపాల్టీలో గ్రేటర్లో భాగం కానున్నాయి. అంటే.. హెచ్ఎండీఏ పరిధి కూడా తగ్గనుంది. ఈ క్రమంలో రాబడి కూడా తగ్గిపోతుంది. HMDAకు నెలనెలా సుమారు రూ.100 కోట్లు ఆదాయం వస్తుండగా.. విలీనం అనంతరం రూ.20 కోట్లకు పడిపోతుందని సమాచారం.