News January 25, 2025
మేడ్చల్ జిల్లాలో వారికి ఏటా రూ.12 వేలు..!

మేడ్చల్ జిల్లాలో భూమిలేని వ్యవసాయ నిరుపేద కూలీలకు ఏటా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరిట రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ నేపథ్యంలో డీఆర్డీఓ అధికారులు సర్వే చేసి 1074 మంది అర్హులైన లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ప్రభుత్వం రేపటి నుంచే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తాజాగా ప్రకటించింది.
Similar News
News November 19, 2025
ఖమ్మం: చలా పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు

ఉమ్మడి జిల్లాలోని పల్లెలపై చలి పంజా విసురుతోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలవుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News November 19, 2025
కారంపూడి: రాచగావు అంటే ఏమిటో తెలుసా..?

కారంపూడిలో నేటి నుంచి పల్నాడు వీరుల ఉత్సవాలు రాచగావుతో ప్రారంభం అవుతున్నాయి. రాచగావు అంటే ఏమిటో తెలుసా..? రాచగావు అనేది వీరుల గుడి పూజారులు పోతురాజు ఆచారవంతునితో కలిసి పోతురాజుకు గావు (రక్షణతో కూడిన చూపు లేదా సేవ) చేస్తూ, ఉత్సవాలకు ప్రారంభం చేస్తారు. ఈ కార్యక్రమం పాటలు, వీర నృత్యాలతో జరుగుతుంది ఉత్సవాలలో వీరుల ఆరాధన, వారి ధైర్య గాథలకు భక్తి తెలియజేసే ముఖ్యమైన పురాణ సాంప్రదాయంగా ఉంది.
News November 19, 2025
వరికోత మిషన్ల కొరత.. రైతుల ఆందోళన

ఖమ్మం జిల్లాలో వరికోతల సమయంలో మిషన్ల కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వచ్చిన మొంథా తుపాను కారణంగా రైతులు వరికోతలు వాయిదా వేసుకున్నారు. దీంతో పంట పొలాలన్నీ ఒకేసారి కోతకు రావడంతో మిషన్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట చేతికొచ్చే అవకాశం ఉండదని అన్నదాతలు వాపోతున్నారు.


