News February 12, 2025
మేడ్చల్ జిల్లాలో సిజేరియన్లు భారీగా పెరిగాయి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739320531349_15795120-normal-WIFI.webp)
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు పెరుగుతున్నాయి. కొద్దిసేపు గర్భిణీకి నొప్పులు రాగానే తట్టుకోలేకపోవడంతో ఒత్తిడి తెచ్చి కుటుంబీకులు సీజేరియన్ కోసం అడుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఒక్క జనవరిలోనే జిల్లాలో 56కుపైగా సిజేరియన్ ఆపరేషన్లు జరిగాయి. సాధారణ ప్రసవాలకు మించి సిజేరియన్ ఆపరేషన్లు జరగుతుండటంతో పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 12, 2025
గురుకుల విద్యార్థులను అభినందించిన మంత్రి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739360612388_52191036-normal-WIFI.webp)
జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించిన బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి బాలవీరాంజనేయస్వామి అభినందనలు తెలిపారు. కర్నూలు జిల్లా చిన్న టేకూరు, ఎన్టీఆర్ జిల్లా ఈడుపుగల్లు, గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులలోని గురుకుల పాఠశాలల నుంచి మొత్తం 190 మంది పరీక్షకు హాజరుకాగా 110మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. వారిని మంత్రి స్వామి అభినందించారు
News February 12, 2025
ఈ కార్లు కొనాలంటే నెలల తరబడి చూడాల్సిందే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739362392050_1045-normal-WIFI.webp)
మహీంద్రా సంస్థకు కార్ల డెలివరీ చాలా ఆలస్యంగా ఇస్తుందన్న పేరుంది. ఆ సంస్థకు చెందిన థార్ రాక్స్, స్కార్పియో-ఎన్ కార్ల డెలివరీ టైమ్ భారీగా ఉంటోంది. రాక్స్ బుక్ చేశాక దాని తాళాలు తొలిసారిగా చేతికి దక్కాలంటే 18 నెలలు వెయిట్ చేయాల్సిందే. ఇక స్కార్పియో-ఎన్కి 2 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఉత్పత్తిని మరింత వేగవంతం చేయాలన్న డిమాండ్ కస్టమర్స్ నుంచి వ్యక్తమవుతోంది.
News February 12, 2025
సిరిసిల్ల: నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి: మాస్టర్ ట్రైనర్లు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739358423963_52088599-normal-WIFI.webp)
ఎన్నికల నియమ నిబంధనలకు అనుగుణంగా ఆర్వోలు, ఏఆర్వోలు విధులు నిర్వర్తించాలని మాస్టర్ ట్రైనర్లు అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు బుధవారం శిక్షణ ఇచ్చారు. ఎన్నికల విధులు ఎంతో జాగరూకతతో నిర్వర్తించాలని నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉంటుందని స్పష్టం చేశారు.