News February 3, 2025

మేడ్చల్ జిల్లాలో 29.48 లక్షల మంది ఓటర్లు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 29.48 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 15.17 లక్షలు కాగా.. మహిళలు 14.30 లక్షలు, ఇతరులు 416 మంది ఉన్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News November 21, 2025

వనపర్తి: జనజ్వాల.. రచనలు రగిలేలా..!

image

WNP రాయిగడ్డ వీధికి చెందిన ప్రముఖ కవి జనజ్వాల దోపిడీ వ్యవస్థను దహించేలా కవితలు, రచనలు చేస్తున్నారు. పేద, ధనిక తారతమ్య భేదం అంటే అసహ్యం. వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న దోపిడీని రూపుమాపేందుకు తన కలంతో రచనలు చేస్తూ దోపిడీ వ్యవస్థను దునుమాడుతున్నాడు. శ్రీశ్రీ స్ఫూర్తితో రచనలకు శ్రీకారం చుట్టిన ఆయన చెరబండరాజు, గద్దర్ ఆశీస్సులతో సాహిత్య శిఖరాలకు చేరారు. విరసం తొలితరం సభ్యులలో ఒకరిగా గుర్తింపు పొందారు.

News November 21, 2025

విశాఖను తాకిన ట్రంప్ ‘టారిఫ్’ ప్రభావం..!

image

ఆక్వారంగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన 50% టారిఫ్ ప్రభావం విశాఖను తాకింది. రాష్ట్రంలో 45 వరకు రొయ్యల ఎగుమతి సంస్థలు ఉండగా విశాఖలోనే 10ఉన్నాయి. సుంకాల ప్రభావంతో సుమారు 70 వేల టన్నుల వనామి రకం రొయ్యల ఎగుమతి నిలిచిపోవడంతో రూ.30వేల కోట్ల టర్నోవర్ దెబ్బతింది. రొయ్యల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మన రాష్ట్రం, అమెరికా సుంకాల కారణంగా ఇతర దేశాలకు ఎగుమతులు చేసే ప్రయత్నాలు ప్రారంభ దశలో ఉన్నాయి.

News November 21, 2025

జోగులాంబ ఆలయంలో భక్తుల సామూహిక చండీ హోమాలు

image

అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం దేవస్థానం అర్చకులు భక్తులతో సామూహిక చండీహోమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ చండీహోమాలు మధ్యాహ్నం 12:30 గంటలకు ముగిసింది. పూర్ణాహుతి సమర్పించి పరిసమాప్తి పలికారు. అనంతరం భక్తులకు యాగ రక్షని ప్రసాదంగా అందజేశారు.