News February 3, 2025
మేడ్చల్ జిల్లాలో 29.48 లక్షల మంది ఓటర్లు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 29.48 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 15.17 లక్షలు కాగా.. మహిళలు 14.30 లక్షలు, ఇతరులు 416 మంది ఉన్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News July 6, 2025
అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ నేవీలో మ్యుజిషియన్ విభాగంలో అగ్నివీర్ నియామకాలకు <
News July 6, 2025
GHMC: అసలు మనకెన్ని ఆస్తులున్నాయి..?

GHMCకి అసలు స్థిరాస్తులు ఎన్ని ఉన్నాయో అధికారులకు అంతుపట్టడం లేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని ఆస్తులను సర్వే చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ మేరకు సర్వే చేయడానికి కన్సల్టెంట్లను టెండర్లకు ఆహ్వానించారు. నాలుగు జోన్లలో దాదాపు 1400 స్థిరాస్తులు ఉన్నాయని రికార్డుల్లో ఉంది. ఎక్కడెక్కడ, ఏఏ ఆస్తులు ఉన్నాయో త్వరలో సర్వే చేసి మొత్తం ఆస్తి వివరాలు తెలుసుకోనున్నారు.
News July 6, 2025
సింహాచలం గిరి ప్రదక్షిణ ట్రాఫిక్ రూల్స్

➦అనకాపల్లి నుంచి విజయనగరం వైపు వెళ్లే వాహనాలు విశాఖ సిటీలోకి రాకుండా లంకెలపాలెం, సబ్బవరం, పెందుర్తి, ఆనందపురం మీదుగా వెళ్లాలి.
➦విజయనగరం నుంచి అనకాపల్లి వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం మీదుగా అనకాపల్లి చేరుకోవాలి.
➦ విజయనగరం నుంచి విశాఖ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, బస్ స్టేషన్, గాజువాక వైపు వెళ్లే వాహనాలు ఆనందపురం నుంచి పెందుర్తి మీదుగా వెళ్లాలి.