News February 3, 2025
మేడ్చల్ జిల్లాలో 29.48 లక్షల మంది ఓటర్లు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 29.48 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 15.17 లక్షలు కాగా.. మహిళలు 14.30 లక్షలు, ఇతరులు 416 మంది ఉన్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News February 10, 2026
విద్యా రంగంలో పార్వతీపురం జిల్లా పనితీరు భేష్.. సీఎం ప్రశంసలు

రాష్ట్రంలోని విద్యారంగంలో పార్వతీపురం జిల్లా అద్భుతమైన పనితీరును కనుబరుస్తోందని CM చంద్రబాబు కొనియాడారు. జిల్లాలో విద్యాశాఖ సాధించిన ప్రగతిపై CM హర్షం వ్యక్తం చేస్తూ అధికారులను, ఉపాధ్యాయులను అభినందించారు. సోమవారం రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ వాఖ్యలు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను జిల్లా చక్కగా వినియోగించుకుంటోందని పేర్కొన్నారు.
News February 10, 2026
ప.గో: సదుపాయాలు కల్పిస్తేనే సిండికేట్ల నుంచి రక్షణ (3/3)

కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర పొందే వీలున్నా, క్షేత్రస్థాయిలో ప్రభుత్వాల చొరవ కరువైంది. మేతలు, ఎరువులపై పర్యవేక్షణ లేకపోవడం, రాయితీలు నేరుగా అందకపోవడం సాగును భారంచేస్తోంది. సిండికేట్ల దోపిడీ నుండి రైతులను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, తక్షణమే క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
News February 10, 2026
SO..SAD కడప: మనుమడి బర్త్ డేకి వచ్చి మృతి.!

కడపలో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్పీబంగ్లా నుంచి ఆర్టీసీ బస్టాండ్ వెళ్లే మార్గంలో జిల్లాని కోర్టు సమీపంలో ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి రాయచోటికి చెందిన నాగేశ్వరరావుగా గుర్తించారు. తన మనుమడి పుట్టినరోజుకు కడపకు రాగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం.


