News January 26, 2025

మేడ్చల్ జిల్లా పురపాలికల్లో సకల సమస్యలు..!

image

మేడ్చల్ జిల్లాలో 4 కార్పొరేషన్లు,9 మున్సిపాలిటీల నుంచి పన్నుల ద్వారా రూ.175 కోట్లు వస్తుండగా,15వ ఆర్థిక సంఘం ద్వారా కూడా ప్రతి నెల ఒక్కొక్క పురపాలక సంఘానికి రూ.3 లక్షల నుంచి రూ.21 లక్షల నిధులు విడుదలవుతున్నాయి.ఈ నిధులతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా, ఏళ్లుగా డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రజలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.

Similar News

News February 13, 2025

రేపు బంద్.. స్కూళ్లకు సెలవు ఉందా?

image

రేపు తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు. దీంతో రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ బంద్‌కు మద్దతివ్వడంపై విద్యార్థి సంఘాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి రేపు బంద్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలు సెలవు ఇవ్వడంపై నిర్ణయం ప్రకటించనున్నాయి. మీ స్కూలుకు సెలవు ఇచ్చారా? కామెంట్ చేయండి.

News February 13, 2025

ఏలూరులో వందే భారత్‌కు అదనపు హాల్ట్ కొనసాగింపు

image

విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/08)కు ఏలూరు రైల్వే స్టేషన్‌లో అదనపు హాల్ట్ మరో ఆరు నెలలు కొనసాగుతుందని వాల్తేరు డివిజన్ డిసిఎం సందీప్ గురువారం తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు రైలు ఆగనున్నట్లు తెలిపారు. ఈ హాల్ట్ ఇరువైపులా ఉంటుందన్నారు. ప్రయాణికుల విషయాన్ని గమనించాలన్నారు.

News February 13, 2025

అనకాపల్లి: తీర్థానికి వస్తుండగా యువకుడు మృతి

image

కె.కోటపాడు-మేడిచర్ల రోడ్డులోని డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మలుపు వద్ద బైకు అదుపుతప్పి చోడవరం(M) గవరవరం గ్రామానికి చెందిన అప్పికొండ కిరణ్ (21) మృతి చెందాడు. విశాఖలో ఉంటున్న కిరణ్ స్వగ్రామమైన గవరవరంలో గ్రామదేవత తీర్థానికి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుని తండ్రి బాబురావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కే.కోటపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!