News April 16, 2025

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు

image

ఉప్పల్ పీహెచ్సీలో టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 750 టీబీ రోగులకు 1,500 పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా గౌరీ, టిబి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. మందులతో పాటు పోషకాహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చని అధికారులు తెలిపారు.

Similar News

News October 16, 2025

నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులకు CPRపై శిక్షణ

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నారాయణపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో CPR (Cardio Pulmonary Resuscitation)పై జిల్లా అధికారులకు ఈరోజు ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. “ప్రస్తుతం హార్ట్ అటాక్‌ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో CPR ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు” అని తెలిపారు.

News October 16, 2025

నారాయణపేట జిల్లా ఎస్పీ ముఖ్య గమనిక

image

నారాయణపేట జిల్లాలో బాణాసంచా విక్రయదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 1884, 2008 చట్టాల ప్రకారం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. పెట్రోల్ బంకు, రద్దీ స్థలాలు, ట్రాన్స్‌ఫార్మర్, వివాదాస్పద స్థలాల్లో దుకాణాలు ఏర్పాటు చేయొద్దని సూచించారు. తహశీల్దార్, పోలీసులు చూపించిన స్థలంలోనే బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

News October 16, 2025

నాగర్‌కర్నూల్: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ యాజమాన్యాలతో సమావేశం

image

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం కింద చదువుతున్న విద్యార్థులను ఎలాంటి ఒత్తిడికి గురి చేయకూడదని జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కరెస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్‌తో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆయన తెలిపారు.