News April 16, 2025
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు

ఉప్పల్ పీహెచ్సీలో టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 750 టీబీ రోగులకు 1,500 పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా గౌరీ, టిబి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. మందులతో పాటు పోషకాహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చని అధికారులు తెలిపారు.
Similar News
News April 22, 2025
నాగార్జునసాగర్ జలాశయం నేటి సమాచారం

నాగార్జునసాగర్ జలాశయం సమాచారాన్ని అధికారులు మంగళవారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుతం 514.60 అడుగులుగా ఉంది. కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల చేయడ లేదు. జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 1,350 క్యూసెక్కులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
News April 22, 2025
చేబ్రోలులో డయేరియా కలకలం

గొల్లప్రోలు మండలం చేబ్రోలులో మూడు రోజుల నుంచి వాంతులు వీరోచనాలతో ప్రజలు బాధపడుతున్నరని సమాచారం. ఇప్పటివరకు వందమందికి వాంతులు, విరోచనాలతో ప్రభుత్వాసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని స్థానికులు చెబుతున్నారు. స్థానిక పిహెచ్సీలో సక్రమమైన వైద్యం అందక చాలామంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ట్రి ట్మెంట్ చేయించుకుంటున్నారు. డయేరియా లక్షణాలపై అధికారులు ఇంకా స్పందించలేదు.
News April 22, 2025
SKLM: సకల జీవులకు ప్రాణాధారం ధరణి

భూమాత కన్నతల్లితో సమానమని ఎన్ని జన్మలు ఎత్తినా కన్నతల్లి బుణం తీర్చలేమని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ ధరిత్రి దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుడమి తల్లి ఆయుస్సును పెంచేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.