News January 27, 2025

మేడ్చల్: టెన్త్ పరీక్షల కోసం 40 రోజుల PLAN

image

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న వేళ 40 రోజుల ప్రత్యేక ప్రణాళికను అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక టెస్టులు  నిర్వహించనున్నట్లు DEO విజయ కుమారి తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక తరగతులు, ప్రీ ఫైనల్, వార్షిక పరీక్షల కోసం కసరత్తు జరగనుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 100% ఉత్తీర్ణత సాధించడం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Similar News

News February 14, 2025

PAపల్లి: రిజర్వాయర్‌లో కోళ్లు.. పోలీసుల అదుపులో అనుమానితుడు..?

image

పెద్దఅడిశర్లపల్లి మండలం అక్కంపల్లి రిజర్వాయర్‌లో కోళ్ల కళేబరాలు బయటపడడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఇవాళ వే2న్యూస్‌లో వార్త పబ్లిష్ కావడంతో అలర్ట్ అయిన అధికారులు.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలతో దేవరకొండ ఆర్డీఓ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. జాలర్లతో కోళ్ల కళేబరాలను బయటకు తీయించారు. కాగా, ఇందుకు బాధ్యుడైన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

News February 14, 2025

సిద్దిపేట: టీజీఐఐసీ భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

image

జిల్లాలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటేడ్ (TGIIC) వారికీ కేటాయించిన భూముల భూసేకరణ వేగంగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

News February 14, 2025

స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తెచ్చేందుకు కృషి: శ్రీనివాస వర్మ

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పునరుద్ఘాటించారు. కొన్ని కారణాల వల్ల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.11,400కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని గుర్తుచేశారు. CM CBN, మంత్రి లోకేశ్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

error: Content is protected !!