News February 3, 2025
మేడ్చల్: పథకాల్లో 60% నిధులు కేంద్రానివే: MP

రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వ 40% నిధులు కేటాయిస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కోట్లాది రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం ఖర్చు పెట్టిందని, ఇప్పటికీ ఖర్చు పెడుతూ ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర నేతలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు.
Similar News
News October 17, 2025
మెదక్: దీపావళి ఆఫర్ల పేరుతో మోసం: ఎస్పీ

దీపావళి పండుగ స్పెషల్ ఆఫర్ల పేరుతో సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియా, వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా నకిలీ వెబ్సైట్ల ద్వారా లింకులు పంపి ప్రజలను మోసం చేస్తున్నారని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు మాట్లాడుతూ.. ఈ లింకుల ప్రలోభాలు చూపి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వివరించారు. ఇలాంటి ఫేక్ లింకులు, వెబ్ సైట్లలో వ్యక్తిగత వివరాలు బ్యాంకు వివరాలు ఇవ్వరాదని సూచించారు.
News October 17, 2025
మహిళలకు ఎడమ కన్ను అదిరితే?

స్త్రీలకు తరచుగా ఎడమ కన్ను అదిరితే శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇది త్వరలో కొత్త వస్త్రాలు, ఆనందకరమైన స్నేహాలు, భాగస్వామితో మంచి అనుబంధం వంటి శుభప్రదమైన ప్రయాణ యోగాన్ని సూచించే దైవిక సంకేతమని అంటున్నారు. కెరీర్లో విజయం సాధించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. అయితే వివాహితకి కుడి కన్ను అదరడం చెడు శకునం అని పేర్కొంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు, ఆటంకాలు ఎదురుకావచ్చని అంటున్నారు.
News October 17, 2025
రన్స్ చేస్తే ఓకే.. చేయలేదో!

INDvsAUS మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అందరి దృష్టి స్టార్ ప్లేయర్లు విరాట్, రోహిత్లపైనే ఉంది. వచ్చే వన్డే వరల్డ్కప్ జట్టులో స్థానం దక్కాలంటే వీరు ఈ సిరీస్లో రాణించడం కీలకం. అదే విఫలమయ్యారో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే వారి ప్రాతినిధ్యంపై సెలక్షన్ కమిటీ, కోచ్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా AUSలో వీరిద్దరికీ మంచి రికార్డ్ ఉంది. రోహిత్, కోహ్లీ చెరో 5 సెంచరీలు బాదారు.