News February 3, 2025

మేడ్చల్: పథకాల్లో 60% నిధులు కేంద్రానివే: MP

image

రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వ 40% నిధులు కేటాయిస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కోట్లాది రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం ఖర్చు పెట్టిందని, ఇప్పటికీ ఖర్చు పెడుతూ ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర నేతలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు.

Similar News

News February 13, 2025

కేటిదొడ్డి: కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో తనిఖీలు

image

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక – తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. కేటిదొడ్డి మండలం నందిన్నె చెక్ పోస్టు వద్ద వెటర్నరీ అధికారి‌ డాక్టర్ నవీన్ చంద్ర, ఎక్సైజ్ కానిస్టేబుల్ జగదీష్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేశారు.

News February 13, 2025

NZB: 70 శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు: కవిత

image

భద్రత కోసం మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన మహిళా జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 70 శాతం పనిచేయడం లేదని ఆరోపించారు.

News February 13, 2025

వనపర్తి: ‘వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలి’

image

బాలలను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలపై ఉందని వనపర్తి జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని అన్నారు. బాలల బెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ న్యాయమిషన్ వారు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రజిని మాట్లాడుతూ.. బాండడ్ లేబర్‌కు వ్యతిరేకంగా ఈమాసంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

error: Content is protected !!