News February 12, 2025
మేడ్చల్: ఫీజు కోసం వేధింపులు.. ఆత్మహత్యాయత్నం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739334739582_1212-normal-WIFI.webp)
మేడ్చల్లో స్కూల్ ఫీజుల వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి తల్లి ఆవేదన.. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమ కుమార్తె అఖిలను పాఠశాల ప్రిన్సిపల్ ఫీజు కోసం వేధించడంతో ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం అఖిల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 12, 2025
చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739363375441_50022931-normal-WIFI.webp)
జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లాలో జలవనరుల శాఖ, జీవనోపాదులుపై అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరుల లభ్యత అధికంగా ఉన్నాయన్నారు. వాటిని సరైన రీతిలో పరిరక్షించుకోవడం వలన జలవనరులు పెరిగి, అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
News February 12, 2025
అనంత: బీటెక్ ఫలితాల విడుదల
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739365363171_51349305-normal-WIFI.webp)
అనంతపురం JNTU పరిధిలో డిసెంబర్, జనవరిలో నిర్వహించిన బీటెక్ 4-1, 4-2 సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ (R15, R19, R20) పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
News February 12, 2025
ఎనుమాముల మార్కెట్ సెక్రటరీ సస్పెండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739362541072_18102126-normal-WIFI.webp)
ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద మార్కెట్గా పేరుగాంచిన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల సస్పెండ్కు గురయ్యారు. జిల్లా పరిధిలోని పత్తి కొనుగోలు కేంద్రాల్లో చోటుచేసుకున్న అక్రమాల నేపథ్యంలో ఆమెను సస్పెండ్ చేస్తూ మార్కెటింగ్ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలకు సంబంధించి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. మార్కెట్ సెక్రటరీ సస్పెండ్ హాట్ టాపిక్గా మారింది.