News March 29, 2025
మేడ్చల్: మరోసారి రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన

మేడ్చల్ జిల్లాలో రేషన్ కార్డులను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అర్హులను ఎంపిక చేసి కార్డుల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,23,938 కార్డులు ఉండగా 72,864 మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాక 85,885 మంది ప్రస్తుతం ఉన్న కార్డులోనే కొత్త పేర్లను నమోదు చేయాలని అప్లై చేశారు.
Similar News
News December 16, 2025
IPL-2026 అప్డేట్

IPL 2026 ప్రారంభ తేదీ మారింది. తొలి మ్యాచ్ మార్చి 26న జరగనుందని Cricbuzz వెల్లడించింది. మే 31న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. కాగా ఇదివరకు మార్చి 15న ఐపీఎల్ ప్రారంభం అవుతుందని నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు రేపు అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం జరగనుంది.
News December 16, 2025
IPL ఆక్షన్.. వీరిపైనే ఫ్రాంఛైజీల ఫోకస్?

మరికొన్ని గంటల్లో IPL మినీ వేలం జరగనుంది. కొందరు ప్లేయర్ల కోసం తీవ్ర పోటీ ఉండే ఛాన్సుంది. ఈ లిస్టులో గ్రీన్(AUS), పతిరణ, హసరంగా(SL), రవి బిష్ణోయ్, V అయ్యర్(IND), మిల్లర్, డికాక్, నోర్జ్(SA), జేమీ స్మిత్, లివింగ్ స్టోన్(ENG) వంటి ఆటగాళ్లున్నారు. అటు గత వేలంలో అన్సోల్డ్గా మిగిలిన IND బ్యాటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఈసారి సోల్డ్ అవుతారా? వారిని ఏ టీమ్ తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
News December 16, 2025
నంద్యాల SP పరిష్కార వేదికకు 107 ఫిర్యాదులు

నంద్యాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 107 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట పరిదిలో సత్వర న్యాయం అందిస్తామని తెలిపారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల్లో ఎక్కువగా సివిల్ కేసులు, ఆస్తి తగాదాలు ఉన్నాయన్నారు.


