News March 29, 2025
మేడ్చల్: మరోసారి రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన

మేడ్చల్ జిల్లాలో రేషన్ కార్డులను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అర్హులను ఎంపిక చేసి కార్డుల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,23,938 కార్డులు ఉండగా 72,864 మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాక 85,885 మంది ప్రస్తుతం ఉన్న కార్డులోనే కొత్త పేర్లను నమోదు చేయాలని అప్లై చేశారు.
Similar News
News November 5, 2025
కోటవురట్ల: రాజీనామా చేసిన వైసీపీ నేతకు బుజ్జగింపులు

కోటవురట్ల మండల వైసీపీ అద్యక్ష పదవికి రాజీనామా చేసిన కిలాడ శ్రీనివాసరావుని పలువురు నేతలు బుజ్జగిస్తున్నారు. ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఫోన్లో మాట్లాడి తొందర పడవద్దని సూచించారు. బుధవారం ఉదయం నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కంబాల జోగులు ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్తో ఫోన్లో మాట్లాడించారు. దత్తుడు సీతబాబు పాల్గొన్నారు.
News November 5, 2025
కూతురితో కలిసి హుస్సేన్సాగర్లో దూకి సూసైడ్

హుస్సేన్సాగర్లో దూకి తల్లీబిడ్డ తనువు చలించారు. లేక్ పోలీసుల వివరాలు.. CA కీర్తిక అగర్వాల్(28), ఆమె పాప కనిపించడం లేదని బహదూర్పురా PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. NOV 2న హుస్సేన్సాగర్లో ఓ యువతి మృతదేహం లభ్యం అవగా విచారించిన పోలీసులు చనిపోయింది కీర్తిక అని గుర్తించారు. భర్తతో విభేదాల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. పాప మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు.
News November 5, 2025
కూతురితో కలిసి హుస్సేన్సాగర్లో దూకి సూసైడ్

హుస్సేన్సాగర్లో దూకి తల్లీబిడ్డ తనువు చలించారు. లేక్ పోలీసుల వివరాలు.. CA కీర్తిక అగర్వాల్(28), ఆమె పాప కనిపించడం లేదని బహదూర్పురా PSలో మిస్సింగ్ కేసు నమోదైంది. NOV 2న హుస్సేన్సాగర్లో ఓ యువతి మృతదేహం లభ్యం అవగా విచారించిన పోలీసులు చనిపోయింది కీర్తిక అని గుర్తించారు. భర్తతో విభేదాల కారణంగా సూసైడ్ చేసుకున్నట్లు నిర్ధారించారు. పాప మృతదేహాన్ని వెలికితీసి దర్యాప్తు చేపట్టారు.


