News March 29, 2025

మేడ్చల్: మరోసారి రేషన్ కార్డుల దరఖాస్తుల పరిశీలన

image

మేడ్చల్ జిల్లాలో రేషన్ కార్డులను మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అర్హులను ఎంపిక చేసి కార్డుల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 5,23,938 కార్డులు ఉండగా 72,864 మంది కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంతేకాక 85,885 మంది ప్రస్తుతం ఉన్న కార్డులోనే కొత్త పేర్లను నమోదు చేయాలని అప్లై చేశారు.

Similar News

News April 17, 2025

ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రికి ఘన స్వాగతం

image

ఉమ్మడి కర్నూలు జిల్లాలో తమ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం సాయంత్రం ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి జోషికి నంద్యాల, కర్నూలు ఎంపీలు బైరెడ్డి శబరి, నాగరాజు,పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, టీజీ వెంకటేష్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఘన స్వాగతం పలికారు. పిన్నాపురంలోని గ్రీన్ కో ప్రాజెక్ట్, అహోబిలంలో ఆయన పర్యటించనున్నారు.

News April 17, 2025

ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ప్రోత్సహించండి: కలెక్టర్

image

జిల్లాలో బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి అక్కడే విద్యనభ్యసించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులు, మండల, నియోజకవర్గ స్పెషల్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో ఎంఈఓలు, తహశీల్దార్లు, స్పెషల్ ఆఫీసర్లు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, ఆర్డీవోతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

News April 17, 2025

ఈ-వేస్ట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

మున్సిపాలిటీల‌తోపాటు అన్ని మండలాల్లోఈ నెల 19 నాటికి ఈ-వేస్ట్ సేక‌ర‌ణ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స్వ‌ర్ణాంధ్ర‌-స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంపై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఎంపిడిఓలు, ఈఓపిఆర్డిలతో క‌లెక్ట‌ర్ టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంపై స‌మీక్షించారు. 13 శాఖలు భాగస్వామ్యం కావాలని ఆయా శాఖల పరంగా చేయవలసిన విధులు, అంశాలను వివరించారు.

error: Content is protected !!